Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
- కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
- అంగీకరించిన న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో నిందితులైన అత్తగారు గిరిబాలా సింగ్ న్యాయస్థానంలో వింత వాదన చేసింది. జైల్లో వార్తాపత్రిక చదవడానికి పూర్తిగా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. తనకు కటింగ్లు కాకుండా.. పూర్తిగా పత్రిక ఇవ్వాలని డిమాండ్ చేసింది. జైలులో తనకు ట్విషా కేసుకు సంబంధించిన వార్తా కథనాలు క్లిప్పింగ్లతో ఇస్తున్నారని గిరిబాల సింగ్ ఆరోపించారు. తనకు పూర్తి వార్తాపత్రికను అందించాలని, అలాగే తన న్యాయవాదులను కలిసేందుకు సమయాన్ని పొడిగించాలని కోర్టును డిమాండ్ చేశారు.
జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరైనప్పుడు.. గిరిబాల సింగ్ తన ఆందోళనలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తమ న్యాయవాదులతో మాట్లాడటానికి తనకు, తన కుమారుడు సమర్థ్ సింగ్కు తగినంత సమయం లభించడం లేదని తెలిపారు. ప్రస్తుతం కేవలం 20 నిమిషాలు మాత్రమే కలవడానికి అనుమతిస్తున్నారని.. ఇది తమ కేసును అర్థం చేసుకోవడానికి చాలా తక్కువ సమయమని పేర్కొన్నారు. తమ సమావేశ సమయాన్ని పొడిగించాలని కోర్టును అభ్యర్థించారు.
Also Read
- Siya Goyal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 4 నెలల ముందే సియా-చేతన్ వివాహం!
- Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
- Women Financial Assistance: మహిళలకు గుడ్ న్యూస్.. ఇక, నెలకు రూ.2,500.. అర్హతలు ఇవే..
- Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల 'యశ్వన్'.!
జైలు యాజమాన్యం తనకు ప్రతిరోజూ ఒక హిందీ, ఒక ఆంగ్ల వార్తాపత్రికను అందిస్తున్నప్పటికీ.. అందులో పెద్ద పొరపాటు జరుగుతోందని గిరిబాల సింగ్ కోర్టుకు తెలిపారు. తన కోడలు ట్విషా మరణానికి సంబంధించిన వార్తలున్న వార్తాపత్రిక భాగాన్ని కత్తెరతో కత్తిరిస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు తన కేసుకు సంబంధించిన వార్తలను కూడా చదివేందుకు తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని గిరిబాల డిమాండ్ చేస్తున్నారు.
వార్తాపత్రికతో పాటు మరో ముఖ్యమైన విషయాన్ని కోర్టుకు తెలిపారు. పోలీసులు ట్విషా ఇంటి నుంచి ఆమెకు చెందిన కొన్ని మందులను స్వాధీనం చేసుకున్నారని.. అయితే ఆ స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాను ఇంకా తనకు గానీ, తన న్యాయవాదికి గానీ అందించలేదని పేర్కొన్నారు. అత్తగారి వాంగ్మూలాన్ని కోర్టు అంగీకరించింది. తదనంతరం స్వాధీనం చేసుకున్న మందుల మెమోను నిందితురాలి న్యాయవాదులకు తక్షణమే అందించాలని కోర్టు దర్యాప్తు సంస్థలను ఆదేశించింది.
మే 12న అత్త గారు గిరిబాలా సింగ్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కథనాలు వచ్చాయి. అయితే అత్తింటి వారే తమ కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లుగా బాధిత కుటుంబం ఆరోపించింది. దీంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
తొలుత భోపాల్ ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన పోస్ట్మార్టం ప్రకారం ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. అయితే ఈ పోస్ట్మార్టంపై బాధిత కుటుంబం అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో న్యాయస్థానం ద్వారా తిరిగి ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల బృందంతో రీ-పోస్ట్మార్టం నిర్వహించారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్యకు ముందే ట్విషా శర్మపై గాయాలు అయినట్లుగా తేలింది. ఆమె తీవ్రంగా పెనుగులాడినట్లుగా నివేదిక వచ్చింది. దీంతో సీబీఐ అధికారులు ఈ కేసు దర్యాప్తు మరింత సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
Anirudh vs Sai Abhayankar: అనిరుద్ vs అభయంకర్.. ఇదెక్కడి పోటీ మావా?
-
Vaibhav Suryavanshi: మూడో టీ20కి ముందు టీమిండియాకు షాక్.. నెట్స్లో గాయపడ్డ ఓపెనర్ వైభవ్! ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?
-
Siya Goyal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 4 నెలల ముందే సియా-చేతన్ వివాహం!
-
YRF : స్పై యూనివర్స్ కి ఎండ్ కార్డు?
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!