TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక నిర్ణయం.. ఏ పార్టీలతో వెళ్లబోతున్నారంటే..!
- తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సన్నాహాలు
- పొత్తులపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు
- మే 7న ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్
- బుధవారం గవర్నర్ను కలవనున్న విజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కు చెందిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు విజయ్ లేఖ రాశారు. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం గవర్నర్ చెన్నైలో లేకపోవడంతో కలవలేకపోయారు. బుధవారం రాజ్భవన్లో విజయ్ కలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా మే 7న ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకోసం టీవీకే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలని విజయ్ భావిస్తున్నట్లుగా టీవీకే వర్గాలు మీడియాకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read
- Kargil Vijay Diwas 2026: కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ..
- Abhijeet Dipke: "ఇది అంతం కాదు.. ఆరంభం".. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
- SBI Manager Slapped: ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ను చెంపదెబ్బ కొట్టిన మాజీ కేంద్ర మంత్రి కుమార్తె.. వీడియో
- Amit Shah: పదవి కంటే దేశం, విద్యార్థులే ముఖ్యమని మరోసారి నిరూపించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
ఇప్పటికే విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని కాంగ్రెస్ను ఆహ్వానించారు. ఇక టీవీకే వర్గాల సమాచారం మేరకు.. కాంగ్రెస్, వామపక్షాలు, చిన్న పార్టీలతో కలతిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్తో పాటు వీసీకే, సీపీఐ, సీపీఐ (ఎం), ఐయూఎంఎల్ పార్టీలుతో వెళ్లే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకోగా… IUML, CPI, CPI(M), VCK పార్టీలు తలో 2 సీట్లు సాధించాయి. ఈ పార్టీల మద్దతు లభిస్తే టీవీకే సులభంగా మెజారిటీ మార్క్ను దాటే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ మాట్లాడుతూ.. ‘‘తమిళనాడు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం.’’ అని తెలిపారు. పార్టీ తుది నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
-
Ferty9: అంతర్జాతీయ పరిశోధనల్లో విశేష గుర్తింపు.. ప్రపంచ వేదికపై తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా ‘ఫెర్టీ9’!
-
Vivo V40e 5G: స్టైలిష్ డిజైన్, 50MP సోనీ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్తో.. వివో V40e 5G ప్రీమియం స్మార్ట్ఫోన్
-
OTT Trending Movie: టాప్ ట్రెండింగ్ లో100 కోట్ల సినిమా.. ఓటీటీలో ఇరగదీస్తున్న యాక్షన్ కామెడీ..
-
Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!