TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక నిర్ణయం.. ఏ పార్టీలతో వెళ్లబోతున్నారంటే..!
- తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సన్నాహాలు
- పొత్తులపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు
- మే 7న ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్
- బుధవారం గవర్నర్ను కలవనున్న విజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కు చెందిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు విజయ్ లేఖ రాశారు. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం గవర్నర్ చెన్నైలో లేకపోవడంతో కలవలేకపోయారు. బుధవారం రాజ్భవన్లో విజయ్ కలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా మే 7న ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకోసం టీవీకే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలని విజయ్ భావిస్తున్నట్లుగా టీవీకే వర్గాలు మీడియాకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
- PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
ఇప్పటికే విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని కాంగ్రెస్ను ఆహ్వానించారు. ఇక టీవీకే వర్గాల సమాచారం మేరకు.. కాంగ్రెస్, వామపక్షాలు, చిన్న పార్టీలతో కలతిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్తో పాటు వీసీకే, సీపీఐ, సీపీఐ (ఎం), ఐయూఎంఎల్ పార్టీలుతో వెళ్లే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకోగా… IUML, CPI, CPI(M), VCK పార్టీలు తలో 2 సీట్లు సాధించాయి. ఈ పార్టీల మద్దతు లభిస్తే టీవీకే సులభంగా మెజారిటీ మార్క్ను దాటే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ మాట్లాడుతూ.. ‘‘తమిళనాడు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం.’’ అని తెలిపారు. పార్టీ తుది నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bigg Boss 10 Telugu: బిగ్బాస్ హౌస్లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
-
Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్లిఫ్ట్లో అదిరిపోయే మార్పులు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!