Mamata Banerjee: బెంగాల్ని బంగ్లాదేశ్లా చేయాలనుకుంటున్నారు.. వైద్యురాలి అత్యాచార కేసుపై మమతా..
- బెంగాల్ని బంగ్లాదేశ్లా చేయాలనుకుంటున్నారు..
- వైద్యురాలి అత్యాచార..హత్య ఘటనపై రాజకీయాలు..
- బీజేపీ..సీపీఎంపై విరుచుకుపడిన సీఎం మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ పీజీ మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా మెడికోలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీపై ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ఈ కేసులోని నిందితులతో టీఎంసీ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా నిన్న కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసును అప్పగించింది.
ఈ ఘటన బీజేపీ, సీపీఎంలు ‘‘చౌకబారు రాజకీయాలకు’’ పాల్పడుతున్నాయని సీఎం మమతా బెనర్జీ బుధవారం ఫైర్ అయ్యారు. ‘‘బాధిత మహిళ కుటుంబానికి అండగా నిలవాల్సిందిపోయి రెండు పార్టీలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ పరిస్థితులు తీసుకురావాలని వారు భావిస్తున్నారు. అయితే తాను అధికారం కోసం అత్యాశతో లేను’’ అని మమతా బెనర్జీ అన్నారు.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
Read Also: Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పికి వీసా నిరాకరించిన అమెరికా..
రాత్రంతా ఈ కేసుని పర్యవేక్షించానని, నేరం గురించి తెలిసిన వెంటనే పోలీస్ కమిషనర్తో పాటు మహిళ తల్లిదండ్రులతో మాట్లాడానని ఆమె చెప్పారు. మేం ఏం చర్యలు తీసుకోలేదు..? అని ఆమె ప్రశ్నించారు. అత్యాచారంలో నిందితుడిని ఉరిశిక్ష విధించేలా చేస్తామని మహిళ తల్లిదండ్రులతో చెప్పినట్లు ఆమె వెల్లడించారు. దీనికి తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. లేడీ డాక్టర్ అంత్యక్రియాలు జరిగే వరకు పోలీసులతో తాను టచ్లో ఉన్నానని, ఆమె కుటుంబాన్ని పోలీసులు ఎస్కార్ట్ చేశారని, నిందితుడిని పోలీసులు 12 గంటల్లో అరెస్ట్ చేసినట్లు మమతా బెనర్జీ చెప్పారు.
‘‘పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని తీసుకెళ్లారు. డీఎన్ఏ పరీక్ష, సీసీటీవీ ఫుటేజ్, ఇతన పరీక్షలు చేసి సమగ్రంగా దర్యాప్తు చేశారు. 12 గంటల్లోనే హంతకుడిని అరెస్ట్ చేశాం’’ అని ఆమె అన్నారు. ఈ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుని కేసుని సీబీఐకి అప్పగించింది. ‘‘ఏదైనా విచారణ కోసం మీరు సమయం ఇవ్వాలి. నేను ఆదివారం వరకు గడువు విధించాను. సరైన విచారణ లేకుండా మీరు ఎవరిపైనా చర్యలు తీసుకోలేరు. నేను సీనియర్, జూనియర్ డాక్టర్లను గౌవిస్తాను. సరైన విచాణ లేకుండా నేను వ్యక్తుల్ని అరెస్టు చేయలేను’’ అని ఆమె అన్నారు. తాము పూర్తిగా హైకోర్టు ఆదేశాలను అనుసరించి సీబీఐకి సహకరిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!