India Canada Conflict: ఖలిస్తానీలను టార్గెట్ చేసింది ‘‘అమిత్ షా’’నే.. కెనడా సంచలనం..
- కెనడాలో ఖలిస్తానీల దాడుల వెనక అమిత్ షా..
- ఆ దేశ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ సంచలన ఆరోపణ..
- దిగజారుతున్న కెనడా ఇండియా సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Canada Conflict: ఇండియా కెనడాల మధ్య సంబంధాలు రోజురోజుకి దిగజారుతున్నాయి. గతేడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఈ హత్యలో ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని సాక్ష్యాత్తు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడంతో వివాదం మొదలైంది. ఇటీవల భారత దౌత్యవేత్తలకు కూడా ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో, మన దేశానికి చెందిన దౌత్యవేత్తల్ని పిలిపించుకున్నాం. ఇదే విధంగా మనదేశంలో ఉన్న కెనడియన్ దౌత్యవేత్తలు ఆరుగురిని దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాం.
Read Also: Periyar: తమిళనాడులో ఎవరూ చేయలేని పని ‘‘విజయ్’’ చేశాడు..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఇదిలా ఉంటే మరోసారి కెనడా ప్రభుత్వం భారత్పై నోరు పారేసుకుంది. కెనడాలో సిక్కు వేర్పాటువాదులను భారత హోంమంత్రి అమిత్ షా టార్గెట్ చేశారని ఆ దేశ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ ఆరోపించారు. కెనడాలో ఖలిస్తానీవాదులపై దాడులకు, హింస వెనక భారత హోం మంత్రి అమిత్ షా హస్తం ఉందని కెనడా ఆరోపించింది. జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని కెనడాలో తదుపరి కార్యకలాపాలను నిర్వహించకుండా నిరోధించాలని భారత్ని కోరింది.
అమిత్ షాపై వచ్చిన ఆరోపణలపై.. ‘‘కెనడా ప్రధాని తన ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారని’’ అని భారత ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. మంగళవారం జరిగిన కెనడియన్ స్టాండింగ్ కమిటీ విచారణలో, మోరిసన్ మాట్లాడుతూ, పాత్రికేయులు తనకు ఫోన్ చేసి, ఆ వ్యక్తి(అమిత్ షా) ఉన్నాడా..? లేదా..? అడిగారని, తాను అతను ఉన్నాడని ధృవీకరించానని చెప్పారు. కెనడాలోని సిక్కు వేర్పాటువాదులపై నిఘా సేకరణ కార్యకలాపాలు, దాడులకు అమిత్ షా అధికారం ఇచ్చారని, కెనడా అధికారులు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో చెప్పారని వాషింగ్టన్ పోస్ట్లోని నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?