India Canada Conflict: ఖలిస్తానీలను టార్గెట్ చేసింది ‘‘అమిత్ షా’’నే.. కెనడా సంచలనం..
- కెనడాలో ఖలిస్తానీల దాడుల వెనక అమిత్ షా..
- ఆ దేశ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ సంచలన ఆరోపణ..
- దిగజారుతున్న కెనడా ఇండియా సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Canada Conflict: ఇండియా కెనడాల మధ్య సంబంధాలు రోజురోజుకి దిగజారుతున్నాయి. గతేడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఈ హత్యలో ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని సాక్ష్యాత్తు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడంతో వివాదం మొదలైంది. ఇటీవల భారత దౌత్యవేత్తలకు కూడా ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో, మన దేశానికి చెందిన దౌత్యవేత్తల్ని పిలిపించుకున్నాం. ఇదే విధంగా మనదేశంలో ఉన్న కెనడియన్ దౌత్యవేత్తలు ఆరుగురిని దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాం.
Read Also: Periyar: తమిళనాడులో ఎవరూ చేయలేని పని ‘‘విజయ్’’ చేశాడు..
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
ఇదిలా ఉంటే మరోసారి కెనడా ప్రభుత్వం భారత్పై నోరు పారేసుకుంది. కెనడాలో సిక్కు వేర్పాటువాదులను భారత హోంమంత్రి అమిత్ షా టార్గెట్ చేశారని ఆ దేశ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ ఆరోపించారు. కెనడాలో ఖలిస్తానీవాదులపై దాడులకు, హింస వెనక భారత హోం మంత్రి అమిత్ షా హస్తం ఉందని కెనడా ఆరోపించింది. జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని కెనడాలో తదుపరి కార్యకలాపాలను నిర్వహించకుండా నిరోధించాలని భారత్ని కోరింది.
అమిత్ షాపై వచ్చిన ఆరోపణలపై.. ‘‘కెనడా ప్రధాని తన ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారని’’ అని భారత ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. మంగళవారం జరిగిన కెనడియన్ స్టాండింగ్ కమిటీ విచారణలో, మోరిసన్ మాట్లాడుతూ, పాత్రికేయులు తనకు ఫోన్ చేసి, ఆ వ్యక్తి(అమిత్ షా) ఉన్నాడా..? లేదా..? అడిగారని, తాను అతను ఉన్నాడని ధృవీకరించానని చెప్పారు. కెనడాలోని సిక్కు వేర్పాటువాదులపై నిఘా సేకరణ కార్యకలాపాలు, దాడులకు అమిత్ షా అధికారం ఇచ్చారని, కెనడా అధికారులు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో చెప్పారని వాషింగ్టన్ పోస్ట్లోని నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!