India Canada Conflict: ఖలిస్తానీలను టార్గెట్ చేసింది ‘‘అమిత్ షా’’నే.. కెనడా సంచలనం..
- కెనడాలో ఖలిస్తానీల దాడుల వెనక అమిత్ షా..
- ఆ దేశ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ సంచలన ఆరోపణ..
- దిగజారుతున్న కెనడా ఇండియా సంబంధాలు..
India Canada Conflict: ఇండియా కెనడాల మధ్య సంబంధాలు రోజురోజుకి దిగజారుతున్నాయి. గతేడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఈ హత్యలో ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని సాక్ష్యాత్తు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడంతో వివాదం మొదలైంది. ఇటీవల భారత దౌత్యవేత్తలకు కూడా ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో, మన దేశానికి చెందిన దౌత్యవేత్తల్ని పిలిపించుకున్నాం. ఇదే విధంగా మనదేశంలో ఉన్న కెనడియన్ దౌత్యవేత్తలు ఆరుగురిని దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాం.
Read Also: Periyar: తమిళనాడులో ఎవరూ చేయలేని పని ‘‘విజయ్’’ చేశాడు..
Also Read
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
ఇదిలా ఉంటే మరోసారి కెనడా ప్రభుత్వం భారత్పై నోరు పారేసుకుంది. కెనడాలో సిక్కు వేర్పాటువాదులను భారత హోంమంత్రి అమిత్ షా టార్గెట్ చేశారని ఆ దేశ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ ఆరోపించారు. కెనడాలో ఖలిస్తానీవాదులపై దాడులకు, హింస వెనక భారత హోం మంత్రి అమిత్ షా హస్తం ఉందని కెనడా ఆరోపించింది. జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని కెనడాలో తదుపరి కార్యకలాపాలను నిర్వహించకుండా నిరోధించాలని భారత్ని కోరింది.
అమిత్ షాపై వచ్చిన ఆరోపణలపై.. ‘‘కెనడా ప్రధాని తన ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారని’’ అని భారత ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. మంగళవారం జరిగిన కెనడియన్ స్టాండింగ్ కమిటీ విచారణలో, మోరిసన్ మాట్లాడుతూ, పాత్రికేయులు తనకు ఫోన్ చేసి, ఆ వ్యక్తి(అమిత్ షా) ఉన్నాడా..? లేదా..? అడిగారని, తాను అతను ఉన్నాడని ధృవీకరించానని చెప్పారు. కెనడాలోని సిక్కు వేర్పాటువాదులపై నిఘా సేకరణ కార్యకలాపాలు, దాడులకు అమిత్ షా అధికారం ఇచ్చారని, కెనడా అధికారులు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో చెప్పారని వాషింగ్టన్ పోస్ట్లోని నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!