India Canada Conflict: ఖలిస్తానీలను టార్గెట్ చేసింది ‘‘అమిత్ షా’’నే.. కెనడా సంచలనం..
- కెనడాలో ఖలిస్తానీల దాడుల వెనక అమిత్ షా..
- ఆ దేశ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ సంచలన ఆరోపణ..
- దిగజారుతున్న కెనడా ఇండియా సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Canada Conflict: ఇండియా కెనడాల మధ్య సంబంధాలు రోజురోజుకి దిగజారుతున్నాయి. గతేడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఈ హత్యలో ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని సాక్ష్యాత్తు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడంతో వివాదం మొదలైంది. ఇటీవల భారత దౌత్యవేత్తలకు కూడా ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో, మన దేశానికి చెందిన దౌత్యవేత్తల్ని పిలిపించుకున్నాం. ఇదే విధంగా మనదేశంలో ఉన్న కెనడియన్ దౌత్యవేత్తలు ఆరుగురిని దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాం.
Read Also: Periyar: తమిళనాడులో ఎవరూ చేయలేని పని ‘‘విజయ్’’ చేశాడు..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇదిలా ఉంటే మరోసారి కెనడా ప్రభుత్వం భారత్పై నోరు పారేసుకుంది. కెనడాలో సిక్కు వేర్పాటువాదులను భారత హోంమంత్రి అమిత్ షా టార్గెట్ చేశారని ఆ దేశ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ ఆరోపించారు. కెనడాలో ఖలిస్తానీవాదులపై దాడులకు, హింస వెనక భారత హోం మంత్రి అమిత్ షా హస్తం ఉందని కెనడా ఆరోపించింది. జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని కెనడాలో తదుపరి కార్యకలాపాలను నిర్వహించకుండా నిరోధించాలని భారత్ని కోరింది.
అమిత్ షాపై వచ్చిన ఆరోపణలపై.. ‘‘కెనడా ప్రధాని తన ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారని’’ అని భారత ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. మంగళవారం జరిగిన కెనడియన్ స్టాండింగ్ కమిటీ విచారణలో, మోరిసన్ మాట్లాడుతూ, పాత్రికేయులు తనకు ఫోన్ చేసి, ఆ వ్యక్తి(అమిత్ షా) ఉన్నాడా..? లేదా..? అడిగారని, తాను అతను ఉన్నాడని ధృవీకరించానని చెప్పారు. కెనడాలోని సిక్కు వేర్పాటువాదులపై నిఘా సేకరణ కార్యకలాపాలు, దాడులకు అమిత్ షా అధికారం ఇచ్చారని, కెనడా అధికారులు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో చెప్పారని వాషింగ్టన్ పోస్ట్లోని నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!