Kolkata Doctor Case: కోల్కతా ఆస్పత్రిపై దాడి తృణమూల్ గుండాల పనే.. బాధితురాలి న్యాయవాది..
- సంచలనంగా కోల్కతా వైద్యురాలి ఘటన..
- ఆస్పత్రిపై దాడి చేసింది తృణమూల్ గుండాలే..
- సాక్ష్యాలు నాశనం చేయడమే వారి ఉద్దేశ్యం..
- బాధితురాలి తరుపు న్యాయవాది సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: కోల్కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ఎన్నో అనుమానాలు వస్తున్నా్యి. చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిదని బాధితురాలి తల్లిదండ్రులు ఇప్పటికే ఆరోపించారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసుని బదిలీ చేసింది.
ఇదిలా ఉంటే, గురువారం జరిగిన నిరసనల్లో కొందరు దుండగులు ఆస్పత్రిలోకి ప్రవేశించి, ఘటన జరిగిన ప్రాంతంలో విధ్వంసానికి దిగారు. ఈ విషయంలో కూడా కోల్కతా పోలీసులు వైఫల్యం చెందినట్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఈ దాడి వెనక మమతా బెనర్జీ ప్రభుత్వమే ఉందని బాధితురాలి తల్లిదండ్రుల తరుపున కేసు వాదిస్తున్న లాయర్ బికాస్ రంజన్ భట్టాచార్య సంచలన ఆరోపణలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ గుండాలు ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. నిరసనకారుల్ని భయపెట్టడం, చెదరగొట్టడంతో పాటు సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఆస్పత్రిపై గుండాలు దాడి చేసినట్లు పేర్కొన్నారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: Minister Savitha: గుడ్న్యూస్.. ఏపీలో త్వరలో నూతన టెక్స్టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ
ఆస్పత్రిపై దాడిలో ప్రతిపక్షాలు బీజేపీ, సీపీఎంల ప్రమేయం ఉందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే, ఈ కేసులో ఇప్పటి వరకు 37 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో టీఎంసీ కార్యకర్తలు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి ఘటనలో అరెస్టైన వారిలో 24 ఏళ్ల జిమ్ ట్రైనర్ కూడా ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు వైఫల్యాన్ని భట్టాచార్య వివరించారు. 31 ఏళ్ల వైద్యురాలు సెమినార్ హాలులో ఘటనకు గురైన తర్వాత, ఆస్పత్రి నిర్వాహకులు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కుమార్తె అనారోగ్యంతో ఉందని చెప్పారు, అరగంట తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఆస్పత్రిలో డాక్టర్లు ఉన్నారు ఇది హత్యా.? ఆత్మహత్యా..? అని తెలియదా అని భట్టాచార్య ప్రశ్నించారు. పోలీసులు సరిగా విచారణ చేయలేదని చెప్పారు.
బాధితురాలి మృతదేహాన్ని మొదట్లో దహనం చేయాలనే ప్రయత్నం జరిగిందని చెప్పారు. ఎందుకంటే మృతదేహం కీలక సాక్ష్యంగా ఉంటుందని చెప్పారు. శవాన్ని కుటుంబ సభ్యులు దహనం చేయాలని పోలీసులు కోరారు. శవాన్ని ముందుగా దశనం చేయడమే వారి ప్రాథమిక ప్రయత్నమని ఆరోపించారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!