Parliament: పార్లమెంట్లో పచ్చి వంకాయ కొరికిన ఎంపీ.. అసలు ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session: దేశంలో ధరల పెరుగుదలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరుగుతోంది. నిత్యావసర ధరల పెరుగుదలపై లోక్సభలో చర్చ చేపట్టాలని కొద్దిరోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికార పక్షం ఈ అంశంపై చర్చించేందుకు అంగీకారం తెలిపింది. సోమవారం లోక్సభలో ధరల పెరుగుదలపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ పచ్చి వంకాయ కొరికి చూపించారు. వంట గ్యాస్ ధరలను కేంద్రం వరుసబెట్టి పెంచుతున్న తీరును నిరసిస్తూ ఆమె ఈ చర్యకు దిగారు. సిలిండర్ ధర పెరగడంతో సామాన్యులు వంట చేసుకోవడం కష్టంగా మారిందని ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు. రూ.600 ఉన్న సిలిండర్ ధరను రూ.1100 చేశారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ మండిపడ్డారు. ప్రజలు పచ్చికూరగాయలు తినాలని ప్రభుత్వం కోరుకుంటోందా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ పచ్చి వంకాయ తిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read Also: Canada Supreme Court: కండోమ్ పెట్టిన చిచ్చు.. కోర్టుకీడ్చిన అమ్మాయి
Also Read
- PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- Rahul Gandhi-Kiren Rijiju: సభలో ఫైటింగ్.. బయట ముచ్చట్లు.. రాహుల్గాంధీ-కిరణ్ రిజిజు సరదా సంభాషణ
మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . పెట్రోల్, డీజిల్ నుంచి గ్యాస్ సిలిండర్ సహా నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంట్లో ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. గ్యాస్ సిలిండర్ ధర గత 5 సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు 1, 2017న గృహాలలో ఉపయోగించే 14.2 కిలోల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.524గా ఉండేది. ఆగస్టు 1, 2018న దీని ధర రూ. 789.50కి పెరిగింది. ఆగస్టు 1, 2019న గ్యాస్ సిలిండర్ ధర రూ.574.5కి తగ్గింది. ఆగస్టు 1, 2020న గ్యాస్ సిలిండర్ ధర రూ.594గా నమోదైంది. జూలై 1, 2021న సిలిండర్ ధర రూ. 834.50కి పెరిగింది. జూలై 6, 2022న సిలిండర్ ధర 1,053కి చేరింది. అంటే ఏడాది వ్యవధిలోనే దీని ధర రూ.218.50 పెరిగిపోయింది.
#NDTVBeeps | Why A Trinamool MP Bit Into Brinjal In Parliament pic.twitter.com/A2Snj7wH25
— NDTV (@ndtv) August 1, 2022
తాజావార్తలు
-
Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు.. చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
-
PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!