Sandeshkhali: టీఎంసీ నేతలే బీజేపీ లక్ష్యం.. సందేశ్ఖలీ అల్లర్లకు ఆర్ఎస్ఎస్ కారణమన్న మమతా బెనర్జీ..
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్ఖలీ అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు చేసిన అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వీరిపై అక్కడి మహిళలు చీపుళ్లు, కర్రలతో ఎదురుతిరిగారు. దీంతో ఒక్కసారిగా ఈ చిన్న గ్రామం జాతీయ వార్తల్లో ప్రధానాంశంగా మారింది. మహిళలు, యువకులు చేస్తున్న ఈ ఆందోళనలకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మద్దతు ఇచ్చింది. బీజేపీ చీఫ్ మజుందార్, ఇతర నేతలు టీఎంసీ గుండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
Read Also: Sivakarthikeyan: శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ సినిమా షూటింగ్ ప్రారంభం..
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ఇదిలా ఉంటే, సందేశ్ఖలీపై టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆ ప్రాంతంలో అశాంతికి ఆర్ఎస్ఎస్ కారణమని దుయ్యబట్టారు. బీజేపీ లక్ష్యం కేవలం టీఎంసీ లీడర్లే అని అన్నారు. ఈ కేసులో నిందితులుగా తేలితే తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నేను ఎవరికీ అన్యాయం జరగనివ్వనని ఆమె అన్నారు. సందేశ్ఖలీకి తమ ప్రభుత్వం మహిళా కమిషన్ని పంపిందని, పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని, 17 మందిని అరెస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు.
షేక్ షాజహాన్ అకృత్యాలకు నిరసనగా వరసగా ఏడో రోజు సందేశ్ఖలీలో ఆందోళనలు మిన్నంటాయి. బుధవారం బీజేపీ చీఫ్ మజుందార్ మహిళలకు సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాటలో ఆయనకు గాయాలయ్యాయి. షాజహాన్, అతని అనుచరులు బలవంతగా ప్రజల భూముల్ని స్వాధీనం చేసుకుని, మహిళలను లైంగికంగా వేధించారని ఆరోపించారు. రేషన్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు సందర్భంగా అధికారులపై జనవరి 5న షేక్ షాజహాన్ అతని గుండాలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత నుంచి అతను పరారీలో ఉన్నాడు. బంగ్లాదేశ్ పారిపోయాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతనికి రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వం, సీఎం మమతా మద్దతు ఇస్తోందని బీజేపీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!