PM Modi: “రాష్ట్రపతిపై వ్యాఖ్యలు”.. సోనియా, రాహుల్ గాంధీలపై ప్రధాని మోడీ ఫైర్..
- రాష్ట్రపతిపై సోనియా గాంధీ వ్యాఖ్యల వివాదం.. కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీఎం మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ ప్రసంగంపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పెదవివిరిచాయి. అయితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ద్వారకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ, సోనియా గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన వర్గం నుంచి వచ్చిన రాష్ట్రపతిని అవమానించారని మండిపడ్డారు.
Read Also: Rashtrapati Bhavan: సోనియాగాంధీ వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్రపతి భవన్
Also Read
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల కాంగ్రెస్ నాయకత్వం అహంకారం, అగౌరవాన్ని ప్రదర్శిస్తోందని మోడీ ఆరోపించారు. ‘‘షాహి పరివార్(రాజకుటుంబం) అహంకారాన్ని చూడండి. గిరిజన నేపథ్యం నుంచి వచ్చి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముని అవమానించారు. షాహి కుటుంబ సభ్యుడు ఒకరు ప్రసంగాన్ని ‘‘బోరింగ్’’ అని అభివర్ణించారు. మరొకరు పాపం అంటూ గిరిజనులను అవమానించారు’’ అని సోనియా గాంధీ పేరుని నేరుగా ప్రస్తావించకుండా ప్రధాని విమర్శించారు.
రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రపతి చివరికి అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది, పాపం’’ అని సోనియా గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ‘‘బోరింగ్’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. రాజ్యాంగంగా అత్యున్నత పదవిని కాంగ్రెస్ అవమానించిందని, గిరిజనులపై కాంగ్రెస్ వైఖరిని ఇది స్పష్టం చేస్తుందని ఆరోపించింది. అయితే, తన తల్లి సోనియాగాంధీ వ్యాఖ్యలపై ఎంపీ ప్రియాంకా గాంధీ వివరణ ఇచ్చారు. ‘ నా తల్లి 78 ఏళ్ల మహిళ. రాష్ట్రపతి సుదీర్ఘ ప్రసంగం ద్వారా అలసిపోయినట్లు మాత్రమే చెప్పారు. రాష్ట్రపతిపై తమకు పూర్తి గౌరవం ఉందని, ఈ విషయాన్ని మీడియా వక్రీకరించడం దురదృష్టకరం’’ అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..