PM Modi: “రాష్ట్రపతిపై వ్యాఖ్యలు”.. సోనియా, రాహుల్ గాంధీలపై ప్రధాని మోడీ ఫైర్..
- రాష్ట్రపతిపై సోనియా గాంధీ వ్యాఖ్యల వివాదం.. కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీఎం మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ ప్రసంగంపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పెదవివిరిచాయి. అయితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ద్వారకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ, సోనియా గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన వర్గం నుంచి వచ్చిన రాష్ట్రపతిని అవమానించారని మండిపడ్డారు.
Read Also: Rashtrapati Bhavan: సోనియాగాంధీ వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్రపతి భవన్
Also Read
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల కాంగ్రెస్ నాయకత్వం అహంకారం, అగౌరవాన్ని ప్రదర్శిస్తోందని మోడీ ఆరోపించారు. ‘‘షాహి పరివార్(రాజకుటుంబం) అహంకారాన్ని చూడండి. గిరిజన నేపథ్యం నుంచి వచ్చి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముని అవమానించారు. షాహి కుటుంబ సభ్యుడు ఒకరు ప్రసంగాన్ని ‘‘బోరింగ్’’ అని అభివర్ణించారు. మరొకరు పాపం అంటూ గిరిజనులను అవమానించారు’’ అని సోనియా గాంధీ పేరుని నేరుగా ప్రస్తావించకుండా ప్రధాని విమర్శించారు.
రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రపతి చివరికి అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది, పాపం’’ అని సోనియా గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ‘‘బోరింగ్’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. రాజ్యాంగంగా అత్యున్నత పదవిని కాంగ్రెస్ అవమానించిందని, గిరిజనులపై కాంగ్రెస్ వైఖరిని ఇది స్పష్టం చేస్తుందని ఆరోపించింది. అయితే, తన తల్లి సోనియాగాంధీ వ్యాఖ్యలపై ఎంపీ ప్రియాంకా గాంధీ వివరణ ఇచ్చారు. ‘ నా తల్లి 78 ఏళ్ల మహిళ. రాష్ట్రపతి సుదీర్ఘ ప్రసంగం ద్వారా అలసిపోయినట్లు మాత్రమే చెప్పారు. రాష్ట్రపతిపై తమకు పూర్తి గౌరవం ఉందని, ఈ విషయాన్ని మీడియా వక్రీకరించడం దురదృష్టకరం’’ అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?