Food Order Via WhatsApp: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Order Via WhatsApp: రైల్వే ప్రయాణికులు మరో గుడ్న్యూస్.. రైలు ప్రయాణీకులు త్వరలో వాట్సాప్ నంబర్ ద్వారా తమకు నచ్చిన, ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసులుబాటు రానుంది.. ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ).. ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్బోట్ను అందుబాటులోకి తెస్తున్నది. ఈ చాట్బోట్పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేయొచ్చు. ఇప్పటికే కొన్ని నిర్దిష్ట రూట్లలో ఐఆర్సీటీసీ.. +91 8750001323 ఫోన్ నంబర్పై వాట్సాప్ ద్వారా ఫుడ్ అందిస్తుండగా.. కస్టమర్ ఫీడ్బ్యాక్ మరియు సూచనల ఆధారంగా, కంపెనీ ఇతర రైళ్లలో కూడా దీన్ని ప్రారంభిస్తుంది అని రైల్వేశాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Turkey Earthquakes: వరుసగా మూడు విధ్వంసకర భూకంపాలు.. 2,300 మందికి పైగా మృతి
Also Read
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
ఐఆర్సీఐసీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్సైట్ www.catering.irctc.co.inతో పాటు ఈ-క్యాటరింగ్ యాప్ ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ ద్వారా ఈ-కేటరింగ్ సేవలను ప్రారంభించిందని తెలిపింది. వాట్సాప్ ద్వారా ఈ-కేటరింగ్ సేవలను రెండు దశల్లో అమలు చేయాలని భావించారు. మొదటి దశ ఇప్పటికే అమలు చేయబడింది, దీని కింద, www.ecatering.irctc.co.inపై క్లిక్ చేయడం ద్వారా ఈ-కేటరింగ్ సేవలను ఎంచుకోవడానికి ఈ-టికెట్ను బుక్ చేసుకునే కస్టమర్లకు బిజినెస్ వాట్సాప్ నంబర్ సందేశాన్ని పంపుతుంది. యాప్ని డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఐఆర్సీటీసీ యొక్క ఈ-కేటరింగ్ వెబ్సైట్ ద్వారా స్టేషన్లలో అందుబాటులో ఉన్న వారికి నచ్చిన రెస్టారెంట్ల నుండి వారికి నచ్చిన భోజనాన్ని బుక్ చేసుకోగలుగుతారు. ఇక, రెండో దశలో ఇంటరాక్టివ్ వాట్సాప్ మీల్ బుకింగ్, డెలివరీకి భారతీయ రైల్వేస్ ప్రణాళిక రూపొందించాయి. ఇందులో వాట్సాప్ నంబర్.. తమ కస్టమర్కు ఇంటరాక్టివ్ టూ వే కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అందుబాటులోకి తేనుంది.. తమకు అవసరమైన మీల్ను ఏఐ-పవర్డ్ చాట్బోట్లోకి వెళ్లి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రతి రోజూ ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సర్వీస్ వెబ్సైట్, యాప్ ద్వారా దాదాపు 50 వేల మందికి భోజనం డెలివరీ చేస్తోంది రైల్వేశాఖ..
తాజావార్తలు
-
Health: రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!