Food Order Via WhatsApp: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Order Via WhatsApp: రైల్వే ప్రయాణికులు మరో గుడ్న్యూస్.. రైలు ప్రయాణీకులు త్వరలో వాట్సాప్ నంబర్ ద్వారా తమకు నచ్చిన, ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసులుబాటు రానుంది.. ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ).. ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్బోట్ను అందుబాటులోకి తెస్తున్నది. ఈ చాట్బోట్పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేయొచ్చు. ఇప్పటికే కొన్ని నిర్దిష్ట రూట్లలో ఐఆర్సీటీసీ.. +91 8750001323 ఫోన్ నంబర్పై వాట్సాప్ ద్వారా ఫుడ్ అందిస్తుండగా.. కస్టమర్ ఫీడ్బ్యాక్ మరియు సూచనల ఆధారంగా, కంపెనీ ఇతర రైళ్లలో కూడా దీన్ని ప్రారంభిస్తుంది అని రైల్వేశాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Turkey Earthquakes: వరుసగా మూడు విధ్వంసకర భూకంపాలు.. 2,300 మందికి పైగా మృతి
Also Read
- CJP: బీజేపీపై భారీ ఉద్యమం.. ఆప్, కాంగ్రెస్లపై మాత్రం కాక్రోచ్ మౌనం.
- Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
- Jitendra Singh: అమిత్ షా కాల్పులకు ఆదేశాలు ఇవ్వరు, మెజిస్ట్రేట్ ఇస్తారు: కేంద్రం క్లారిటీ..
- Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
ఐఆర్సీఐసీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్సైట్ www.catering.irctc.co.inతో పాటు ఈ-క్యాటరింగ్ యాప్ ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ ద్వారా ఈ-కేటరింగ్ సేవలను ప్రారంభించిందని తెలిపింది. వాట్సాప్ ద్వారా ఈ-కేటరింగ్ సేవలను రెండు దశల్లో అమలు చేయాలని భావించారు. మొదటి దశ ఇప్పటికే అమలు చేయబడింది, దీని కింద, www.ecatering.irctc.co.inపై క్లిక్ చేయడం ద్వారా ఈ-కేటరింగ్ సేవలను ఎంచుకోవడానికి ఈ-టికెట్ను బుక్ చేసుకునే కస్టమర్లకు బిజినెస్ వాట్సాప్ నంబర్ సందేశాన్ని పంపుతుంది. యాప్ని డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఐఆర్సీటీసీ యొక్క ఈ-కేటరింగ్ వెబ్సైట్ ద్వారా స్టేషన్లలో అందుబాటులో ఉన్న వారికి నచ్చిన రెస్టారెంట్ల నుండి వారికి నచ్చిన భోజనాన్ని బుక్ చేసుకోగలుగుతారు. ఇక, రెండో దశలో ఇంటరాక్టివ్ వాట్సాప్ మీల్ బుకింగ్, డెలివరీకి భారతీయ రైల్వేస్ ప్రణాళిక రూపొందించాయి. ఇందులో వాట్సాప్ నంబర్.. తమ కస్టమర్కు ఇంటరాక్టివ్ టూ వే కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అందుబాటులోకి తేనుంది.. తమకు అవసరమైన మీల్ను ఏఐ-పవర్డ్ చాట్బోట్లోకి వెళ్లి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రతి రోజూ ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సర్వీస్ వెబ్సైట్, యాప్ ద్వారా దాదాపు 50 వేల మందికి భోజనం డెలివరీ చేస్తోంది రైల్వేశాఖ..
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్
-
CJP: బీజేపీపై భారీ ఉద్యమం.. ఆప్, కాంగ్రెస్లపై మాత్రం కాక్రోచ్ మౌనం.
-
Mohammed Shami: రంజీల్లో రికార్డులు కొట్టినా లభించని చోటు.. షమీకి భారీ ఎదురుదెబ్బ..
-
Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
-
Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్పోర్ట్కు కౌంట్డౌన్.. ఉత్తరాంధ్రపై పార్థసారథి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!