Toxic Air Turns Deadly: ఢిల్లీలో ప్రతిరోజూ 25 మంది మృతి.. ప్రభుత్వం విడుదల చేసిన షాకింగ్ డేటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic Air Turns Deadly: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రాణాంతక స్థాయికి చేరింది. శ్వాస తీసుకోవడమే కాదు, జీవితం కూడా కుదించేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, 2024 సంవత్సరంలో శ్వాసకోశ మరియు గుండె సంబంధిత వ్యాధుల కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ గణాంకాలను సగటుగా తీసుకుంటే, ఢిల్లీలో ప్రతిరోజూ సుమారు 25 మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2024లో శ్వాసకోశ వ్యాధుల వల్ల 9,211 మరణాలు నమోదయ్యాయి. ఇది 2023లో నమోదైన 8,801 మరణాలతో పోలిస్తే స్పష్టమైన పెరుగుదల. ఉబ్బసం, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా నిపుణులు గుర్తిస్తున్నారు. కాలుష్యభరితమైన గాలి, దుమ్ము, పొగ, వాహనాల ఉద్గారాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని చెబుతున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యాధులు ఇక వృద్ధులకే పరిమితం కాకుండా పిల్లలు, యువతను కూడా ప్రభావితం చేస్తున్నాయి.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
మరణాలకు ప్రధాన కారణంగా ప్రసరణ వ్యవస్థ వ్యాధులు నిలిచాయి. 2024లో గుండెపోటు, స్ట్రోక్, గుండె ఆగిపోవడం వంటి కారణాలతో 21,262 మంది మరణించారు. 2023లో ఈ సంఖ్య 15,714 మాత్రమే కావడం గమనార్హం. ఒకే ఏడాదిలో 5,500కిపైగా మరణాలు పెరగడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, అసమతుల ఆహారం, కాలుష్యం వంటి అంశాలు దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక అంటు మరియు పరాన్నజీవుల వ్యాధుల వల్ల 2024లో 16,060 మరణాలు సంభవించాయి. ఇది 2023తో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ, కలుషిత నీరు, పేలవమైన పారిశుధ్యం, అధిక జనసాంద్రత కారణంగా ముప్పు ఇంకా కొనసాగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా 2024లో ఢిల్లీలో 1,39,480 మరణాలు నమోదయ్యాయి. 2023లో ఈ సంఖ్య 1,32,391గా ఉంది. మరణాల్లో 85,391 మంది పురుషులు, 54,051 మంది మహిళలు, 38 మంది ఇతర లింగాలకు చెందినవారు ఉన్నారు. వీటిలో 90,883 మరణాలు వైద్యపరంగా ధృవీకరించబడ్డాయి. మరణాల రేటు కూడా పెరగడం గమనార్హం. 2023లో వెయ్యి మందికి 6.16గా ఉన్న మరణాల రేటు, 2024లో 6.37కి పెరిగింది. మరోవైపు, 2024లో ఢిల్లీలో 3,06,459 సజీవ జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఇది 2023తో పోలిస్తే 8,628 తక్కువ. ఈ గణాంకాలు ఢిల్లీ ఎదుర్కొంటున్న ఆరోగ్య సంక్షోభానికి స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తున్నాయి. గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే, పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!