MTNL Closed: మూసివేత దిశగా MTNL ….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MTNL Closed: కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను మూసివేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. టెలికాం ఆపరేటర్ సంస్థ అయిన మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL)ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. MTNLలో పనిచేస్తున్న సిబ్బందిని మరియు అందుకు సంబంధించిన కార్యకలాపాలను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కి బదిలీ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
రెండు సంస్థలను విలీనం చేయాలనే గతంలొ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఇది జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. MTNL ఎదుర్కొంటున్న రుణాలు మరియు నిరంతర నష్టాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Read also: WTC Final 2023: ట్రెడిషనల్ డ్రెస్ లో ఇషాన్ కిషన్ గర్ల్ఫ్రెండ్.. ఫోటోలు వైరల్..!
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
MTNL యొక్క మూసివేత ఆసన్నమైందని, BSNL దాని కార్యకలాపాలపై నియంత్రణను చేపట్టడానికి సిద్ధంగా ఉందని ఉన్నతస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో MTNL రూ. 2,910 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం(2021-22) రూ. 2,602 కోట్ల నష్టంతో పోలిస్తే పెరుగుదలను సూచిస్తుంది. కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,069 కోట్ల నుంచి రూ. 861 కోట్లకు క్షీణించింది. ఇదే సమయంలో ఖర్చులు రూ. 4,299 కోట్ల నుంచి రూ. 4,384 కోట్లకు పెరిగాయని నివేదికలో పేర్కొంది. అదనంగా MTNL యొక్క బకాయిలు 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.19,661 కోట్లు ఉండగా.. అదికాస్త 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.23,500 కోట్లకు పెరిగాయి.
Read also: AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారికి గుడ్న్యూస్
ఇక BSNLకి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో BSNL ఆదాయాలు దాదాపు రూ. 20,700 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఉన్న రూ. 19,052 కోట్లను అధిగమించింది. అయితే BSNL కంపెనీ నష్టాలు గతంలో ఉన్న రూ.6,981 కోట్లతో పోలిస్తే రూ.8,161 కోట్లకు విస్తరించాయి. ఆదాయంలో పెరుగుదలకు ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) కనెక్షన్ల సంఖ్య పెరగడంతోపాటు లీజుకు తీసుకున్న లైన్ సేవల నుండి వ్యాపారాన్ని వృద్ధి చేయడం మరియు అదనపు నిర్వహణ ఆదాయం కారణాలు చెప్పారు. ముఖ్యంగా FTTH వ్యాపారం సంవత్సరానికి 30 శాతం గణనీయమైన వృద్ధిని సాధించింది. క్యారియర్ యొక్క వైర్లెస్ వ్యాపారాన్ని అధిగమించింది. ఇది మొత్తం రాబడిలో మూడింట ఒక వంతు కంటే తక్కువగా అందించింది. మరియు 2023 ఆర్థిక సంవత్సరంకి సంబంధించి కేవలం 7 శాతం వృద్ధితో రూ. 5,638 కోట్లకు చేరుకుంది.
Read also: Viral News: కొబ్బరిబొండాలను తాగేవారికి హెచ్చరిక.. ఇది మీ కోసమే..
2019లో ఆ తరువాత 2022లో BSNL మరియు MTNLలు ప్రభుత్వం నుండి రెండు ఉపశమన ప్యాకేజీలను అందుకున్నాయి. 2019లో ప్రభుత్వం రూ. 69,000 కోట్ల విలువైన ప్యాకేజీని మంజూరు చేసింది. BSNL మరియు MTNL ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం, క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ద్వారా 4G సేవలను అందించడానికి అడ్మినిస్ట్రేటివ్ స్పెక్ట్రమ్ కేటాయింపు, రుణ పునర్నిర్మాణ ప్రయోజనాల కోసం 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలవ్యవధితో సార్వభౌమ బాండ్ల జారీతో సహా పలు చర్యలను ఈ ప్యాకేజీలో పొందుపరిచారు. సంస్థల రాబడిని పెంచడానికి భూమి, భవనాలు, టవర్లు మరియు ఫైబర్ ఆస్తులను మానిటైజేషన్ చేయడం… ఇంకా BSNL మరియు MTNL విలీనానికి సూత్రప్రాయ ఆమోదం కూడా ఫ్యాకేజీలో ఉంది. పునరుద్ధరణ ప్యాకేజీకి సంబంధించి గతంలో ప్రకటించిన BSNL యొక్క బ్యాలెన్స్ షీట్పై ఆర్థిక భారాన్ని తగ్గించడం, రుణ పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టాలని సూచించింది. అందులో భాగంగానే ప్రభుత్వం BSNL మరియు MTNLలకు సావరిన్ గ్యారెంటీని అందిస్తుంది. ఇది దీర్ఘకాలిక రుణాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. దీర్ఘకాలిక బాండ్ల జారీ ద్వారా రెండు ప్రభుత్వ రంగ సంస్థలు (పిఎస్యులు) రూ. 40,399 కోట్ల మొత్తాన్ని సమీకరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ వ్యూహాత్మక చర్య వారి ప్రస్తుత రుణాన్ని పునర్నిర్మించడానికి మరియు వారి బ్యాలెన్స్ షీట్లపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
- Tags
- BSNL
- buildings
- employees
- MTNL
- Telephones
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!