Delhi: నేడు ఢిల్లీలో జీఎస్టీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
- నేడు ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
- హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, ఏపీ నుంచి పయ్యావుల కేశవ్ పాల్గొననున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సీబీఈసీ ఛైర్ పర్సన్ హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Trump: భారత్ టారిఫ్లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వైట్హౌస్లో మీడియా ప్రశ్నకు సమాధానమిదే!
Also Read
- Bangladesh: ‘‘ముళ్ల కంచెలు మమ్మల్ని ఆపలేవు’’.. సువేందు ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం..
- CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
- Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
- NEET Paper Leak: నీట్ పేపర్ లీక్లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
మొత్తం 33 మంది సభ్యులతో కూడిన ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో జీఎస్టీ స్లాబ్లలో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం జీఎస్టీ స్లాబ్లను రద్దు చేసి సంబంధిత ఉత్పత్తులను 5 శాతం, 18 శాతం స్లాబ్లోకి మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టుబాకో, లగ్జరీ ఉత్పత్తులపై మాత్రం 40 శాతం జీఎస్టీ కొనసాగనుంది. ఈ సవరణలతో ఆటోమొబైల్ రంగం ప్రధాన లబ్ధిదారు కానుంది.
ఇది కూడా చదవండి: BCCI: టైటిల్ స్పాన్సర్ వేటలో బీసీసీఐ.. ఆ కంపెనీలకు నో ఛాన్స్!
ఇక చిన్న హైబ్రిడ్ కార్లు, మోటార్సైకిళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనున్నట్లు సమాచారం. అలాగే ఎస్యూవీ వాహనాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న 50 శాతం జీఎస్టీని 40 శాతానికి తగ్గవచ్చని తెలుస్తోంది. ఇక ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం జీఎస్టీ తగ్గింపు వాహనాల ధరలను 6-8 శాతం వరకు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయాల వల్ల ద్విచక్రాల వాహనాల విక్రయాలు సంవత్సరానికి 10 శాతం వృద్ధి సాధించవచ్చని.. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 8 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘ముళ్ల కంచెలు మమ్మల్ని ఆపలేవు’’.. సువేందు ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Campa Cola vs Coca-Cola: ‘కోలా వార్’లో కొత్త మలుపు.. అంబానీ ‘క్యాంపా’ దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
-
CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
-
Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!