Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
- ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టు టీఎంసీ..
- కౌంటింగ్ విధుల్లో కేంద్ర ఉద్యోగులు నియామకానికి వ్యతిరేకంగా పిటిషన్..
- రేపు సుప్రీంకోర్టు విచారణకు వచ్చే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Elections: దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉంది. కౌంటిక్ ముందు మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మే 4న జరిగే ఓట్ల లెక్కింపులో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తప్పించడంపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అ పిటిషన్ను అత్యవసరం విచారించాలని టీఎంసీ సుప్రీంకోర్టును కోరింది. అయితే ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును శనివారం విచారణకు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమచారం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంతకుముందు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు, పోలీసులు టీఎంసీ కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.
Also Read
- Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
- PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
- Mamata Banerjeeకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్.!
- NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్కు ముందు విషాదం.. 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య..
ఇటీవల, పశ్చిమ బెంగాల్ అదనపు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఒక ప్రకటనలో.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఉండే కౌంటింగ్ సూపర్వైజర్ లేదా కౌంటింగ్ అసిస్టెంట్లలో కనీసం ఒకరు కేంద్ర ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ) ఉద్యోగి అయి ఉండాలని చెప్పారు. అయితే, ఇలాంటి ఉత్తర్వులను ఎన్నికల సంఘం మాత్రమే జారీ చేయగలదని, అదనపు సీఈఓ కాదని వాదిస్తూ టీఎంసీ ఈ ఆదేశాన్ని సవాలు చేసింది.
Read Also: Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
ఎన్నికల హ్యాండ్ బుక్ ప్రకారం కౌంటింగ్ సిబ్బంది కేంద్ర ఉద్యోగులే ఉండాలని ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. మైక్రో అబ్జర్వులు మాత్రం సాధారణంగా కేంద్ర సర్వీస్ నుంచి వస్తారని, కానీ కౌంటింగ్ సిబ్బందికి ఈ నిబంధనలు వర్తింపచేయడం అన్యాయమని టీఎంసీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ ప్రభావానికి లోనయ్యే అవకావం ఉందని, ఇది సమాన పోటీకి విఘాతం కలిగిస్తుందని టీఎంసీ ఆరోపించింది.
అయితే, టీఎంసీ ఈ వాదనను అంతకుముందు కలకత్తా హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కేంద్ర లేదా రాష్ట్ర ఉద్యోగుల్ని నియమించుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి భద్రతా చర్యలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజావార్తలు
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
-
Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు… ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
-
Gill-Gambhir: టీమిండియాకు తలనొప్పులు తప్పవు.. గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు!
-
US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!