పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం పూనుకుంది. ఇందుకోసం ఆయా దేశాలు వెళ్లేందుకు బృందాలను ఏర్పాటు చేశాయి. అయితే ఎంపీల పేర్లు ఇవ్వాలంటూ ఆయా పార్టీలకు కేంద్రం లేఖలు రాసింది. కానీ విచిత్రం ఏంటంటే.. పార్టీలు ప్రతిపాదించకుండానే కేంద్రం దౌత్య బృందాలను ఏర్పాటు చేశాయి. ఇప్పటికే శశిథరూర్ ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ గుర్రుగా ఉంది. తాజాగా తమను సంప్రదించకుండా యూసఫ్ పఠాన్ పేరును దౌత్య బృందంలో చేర్చడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: JR NTR : జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..?
తమను సంప్రదించకుండానే యూసఫ్ పఠాన్ ఎంపిక జరిగిందంటూ ఆ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ అన్నారు.ఒక పార్టీ ఎంపీని ఎంపిక చేసేటప్పుడు ఆ పార్టీతో సంప్రదింపులు జరపాలని కేంద్రానికి సూచించారు. అంతేకాక.. కేంద్రం నిర్ణయించిన దౌత్య బృందం పర్యటనకు పఠాన్ వెళ్లడం లేదని స్పష్టంచేశారు. విమర్శలు రావడంతో బృందం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ పఠాన్ తప్పుకున్నారు.
ఇది కూడా చదవండి: Surya : పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న #Surya 46
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అయితే ఉగ్రవాదులు చనిపోతే వారికి పాక్ సైన్యం హాజరుకావడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇస్తుందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో పాక్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన నేతలతో బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాల్లో ముస్లిం ఎంపీలు ఉండేలా చూసింది. మొత్తం 51 మంది నేతలు 7 బృందాలుగా విదేశాల్లో పర్యటించనున్నారు.