Tina Ambani: ఈడీ విచారణకు హాజరైన టీనా అంబానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tina Ambani: రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫెమా ఉల్లంఘన కేసులో ఆమె ఈడీ ముందు హాజరుకావాల్సి వచ్చింది. ఇదే కేసులో సోమవారం అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ఏరియాలో ఉన్న ఈడీ ఆఫీసులో టీనా అంబానీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read also: Goat Eye: బలి కోసం తెచ్చిన మేక కన్ను.. మనిషిని చంపింది.. ఎలానో తెలిస్తే బిత్తరపోతారు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
విదేశీ మారకద్రవ్యం చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై ఈడీ ప్రశ్నించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్టు పేర్కొన్నారు. అనిల్ అంబానీపై ఫెమా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు చెప్తున్నారు. అనిల్ అంబానీతోపాటు ఆయన భార్య టినా అంబానీ ఈ వారంలో మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఈడీ సమన్లు జారీ చేసిన అధికారులు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) సెక్షన్ల కింద అనిల్ అంబానీ సోమవారం ఈ కేసులో తన స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఈ వారం చివరిలో ఫెడరల్ ఏజెన్సీ ముందు హాజరుకావాల్సి ఉంది. జెర్సీ, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ మరియు సైప్రస్లోని కొన్ని ఆఫ్షోర్ కంపెనీలతో అనిల్ అంబానీ లింక్లున్నట్టు ఆరోపణల నేపథ్యంలో ED విచారణ కొనసాగిస్తోంది. యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ మరియు ఇతరులపై మనీలాండరింగ్ కేసులో 2020లో ఏజెన్సీ అతన్ని ప్రశ్నించింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 814 కోట్లకు పైగా వెల్లడించని నిధులపై రూ.420 కోట్ల పన్నులు ఎగవేసినందుకు నల్లధన నిరోధక చట్టం కింద గత ఏడాది ఆగస్టులో ఆదాయపు పన్ను శాఖ అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు మార్చిలో ఈ షోకాజ్ నోటీసు మరియు పెనాల్టీ డిమాండ్పై మధ్యంతర స్టే విధించిన సంగతి తెలిసిందే. అనిల్ అంబానీపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని ఆదాయపు పన్ను శాఖను కోరింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!