Deepfake video: సచిన్ టెండూల్కర్ డీప్ఫేక్ వీడియోపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepfake video: ఇటీవల కాలంలో దేశంలో ప్రముఖుల డీప్ఫేక్ వీడియోలో ఆందోళన కలిగిస్తు్న్నాయి. ఏఐ టెక్నాలజీ సాయంతో వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారు. గతంలో రష్మికా మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ వంటి మూవీ స్టార్స్ డీప్ఫేక్కి బారినపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా క్రికెట్ స్టార్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా డీప్ఫేక్ బాధితుడయ్యారు. సచిన్ ఆన్లైన్ గేమ్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వాయిస్తో ఓ వీడియో వైరల్ అవుతోంది. డీప్పేక్ టెక్నాలజీతో ఈ వీడియోను రూపొందించారు. దీనిపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు అనుగుణంగా ఉండేలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం కింద కఠినమైన నిబంధనలకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
Read Also: Viral News: గర్ల్ ఫ్రెండ్ కోసం అలాంటి పని చేసి అడ్డంగా దొరికిన యువకుడు.. అయ్యో ఎంత పనైంది..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
కేంద్రం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ ద్వారా స్పందించారు. వీడియోను గురించి చెప్పినందుకు సచిన్ టెండూల్కర్కి ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన డీప్ఫేక్లు మరియు తప్పుడు సమాచారం భారతీయ వినియోగదారుల భద్రత మరియు విశ్వాసానికి ముప్పు అని కూడా ఆయన అన్నారు. డీప్ఫేక్, తప్పుడు సమాచారం భారతీయ వినియోగదారుల భద్రత, నమ్మకానికి హని కలిగిస్తుందని, చట్టపరమైన ఉల్లంఘనలకు దారితీస్తుందని, ఇది నిరోధించాలని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్కి సూచించారు. ఐటీ చట్టం కింద కఠిన నిబంధనలను త్వరలో తెలియజేస్తామని ఆయన ట్వీట్ చేశారు.
డీప్ఫేక్ వీడియోపై స్పందిస్తూ.. ఈ వీడియో నకిలీదని ఈ రకంగా సాంకేతికతను దుర్వినియోగం చేయడం తప్పు, మీరు అలాంటి వీడియోలు, యాప్లు లేదా ప్రకటనలు చూసినట్లైతే వాటిని వెంటనే నివేదించాలని ఎక్స్(ట్విట్టర్)లో కోరారు. గతంలో రష్మికా మందన్న డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ టెక్నాలజీపై సెలబ్రెటీలు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఇలాంటివి ఆందోళనకరమని అన్నారు. ఐటీ చట్టంలో కఠిన నిబంధనలు తీసుకురావాలని కోరారు.
Thank you @sachin_rt for this tweet #DeepFakes and misinformation powered by #AI are a threat to Safety&Trust of Indian users and represents harm & legal violation that platforms hv to prevent and take down.
Recent Advisory by @GoI_MeitY requires platforms to comply wth this… https://t.co/DGe2utFjBM
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) January 15, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!