Amit Shah: దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారు త్వరలోనే సిగ్గుపడతారు..
- త్వరలో ఇంగ్లీష్ మాట్లాడే వారు సిగ్గుపడుతారు..
- భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొందాల్సిన సమయం వచ్చింది..
- మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు ..
- భారతీయ భాషలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్నారు. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ దేశంలో, ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు . అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను. మన భాషలు లేకుంటే, మనం నిజంగా భారతీయులుగా ఉండటం మానేస్తాము.’’ అని అమిత్ షా అన్నారు.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
‘‘మన దేశాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రను, మన మతాన్ని అర్థం చేసుకోవడానికి, ఏ విదేశీ భాష కూడా సరిపోదు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేము. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి, ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాము, ప్రపంచాన్ని కూడా నడిపిస్తాము’’ అని అన్నారు.
Read Also: Thug Life: ‘‘థగ్ లైఫ్’’ రిలీజ్ చేయాలి, ఇది మీ కర్తవ్యం.. కర్ణాటకపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
‘‘ప్రధాని మోడీ అమృత కాలం కోసం ‘పంచ్ ప్రాణ్’ (ఐదు ప్రతిజ్ఞలు) కు పునాది వేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క లక్ష్యాన్ని సాధించడం, బానిసత్వం యొక్క ప్రతి జాడను వదిలించుకోవడం, మన వారసత్వం పట్ల గర్వపడటం, ఐక్యత మరియు సంఘీభావానికి కట్టుబడి ఉండటం, ప్రతి పౌరుడిలో విధి స్ఫూర్తిని రగిలించడం – ఈ ఐదు ప్రతిజ్ఞలు 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయి. అందుకే 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటాం, ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి’’ అని చెప్పారు.
మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన పుస్తకం గురించి మాట్లాడుతూ.. పరిపాలన అధికారుల శిక్షణలో మార్పు అవసరమని కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఏదైనా పాలకుడు లేదా నిర్వాహకుడు సానుభూతి లేకుండా పాలిస్తే, వారు పాలన యొక్క నిజమైన లక్ష్యాన్ని సాధించలేరని అన్నారు. మన దేశం కటిక చీకటిలో ఉన్నప్పుడు కూడా మన సాహిత్యం, మన మతం, స్వేచ్ఛ, సంస్కృతి దీపాలను వెలిగించిందని అన్నారు. సాహిత్య మన సమాజానికి ఆత్మ అని కేంద్ర హోంమంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!