Ayodhya Ram Mandir: రామున్ని నమ్మని వారికి ఇదే గతి.. సంజయ్ రౌత్కి ఆలయ పూజారి కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir: ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడుతారని ఆయన అన్నారు. ఎంపీ, శివసేవ(ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. సంజయ్ రౌత్ కేవలం ఎన్నికలను మాత్రమే చూడగలరని.. విగ్రహ ప్రాణప్రతిష్ట అనేది విశ్వాసం, భక్తికి సంబంధించిందని అందుకే ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించామని ఆయన అన్నారు. గతంలో భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలకు కూడా ఆయన వచ్చారని ఆచార్య సత్యేంద్ర దాస్ గుర్తు చేశారు.
ప్రస్తుతం ఆలయం దాదాపుగా నిర్మించబడింది, విగ్రహ ఏర్పాటు జనవరి 22న నిర్వహించబడుతుంది, ప్రధాని మంత్రిని ఆహ్వానించాం, ఆయన మా ఆహ్వానాన్ని అంగీకరించారని అన్నారు. ఇది కేవలం త్యాగాల గురించి కాదని, భక్తి, విశ్వాసాలకు సంబంధించిందని ఆయన అన్నారు.
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Read Also: Jammu Kashmir: కుప్వారాలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు లష్కరే ఉగ్రవాదుల హతం..
ప్రధాని నరేంద్రమోడీకి శ్రీరాముడి ఆశీస్సులు ఉన్నాయని, అందుకే ఆయన అధికారంలో ఉన్నారని, రాముడి ఉనికిని నిరాకరించిన వారు వీధుల్లో తిరుగుతున్నారని, అలాగే కొనసాగుతారని దాస్ అన్నారు. ‘‘ రాజకీయాలు, ఎన్నికలకు సంబంధించింత వరకు అవి వస్తాయి, పోతాయి, అయితే శ్రీరాముడి ఆశీస్సులు ప్రధాని మోడీకి ఉన్నాయని అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన అధికారంలో ఉన్నారు. అలాగే కొనసాగుతారు. రాముడిని వ్యతిరేకించే వారు వీధుల్లోనే ఉంటారు’’ అని దాస్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మణిపూర్ తప్ప ఎక్కడికైనా వెళ్తారు, ఆయనను ప్రత్యేకంగా అయోధ్యకు ఆహ్వానించాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద ఈవెంట్ ను ఎవరైనా ఎందుకు వదిలేస్తారు..? మణిపూర్ తప్పా, ఇజ్రాయిల్, గాజా కూడా వెళ్లొచ్చు అంటూ సెటైర్లు వేశాడు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. అయోధ్య రామమందిరం పార్టీ కార్యక్రమంగా మారుతుందా..? దేవుడు అందరికి చెందిన వాడు, ప్రతీ పార్టీకి ఆహ్వానం అందాలి, ఒకపార్టీకి ఆహ్వానం పంపడమేంటని ప్రశ్నించారు.
#WATCH | Chief priest of Ram Janmabhoomi, Acharya Satyendra Das says, "People talk as per their mindset. Sanjay Raut can see only elections. The pran pratishtha is a matter of faith, of belief, of devotion and the PM has been invited for it…Earlier too, he had performed the… https://t.co/gu1sM0K1Fe pic.twitter.com/la7udQFMWb
— ANI (@ANI) October 26, 2023
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?