PM Modi: “ఎన్నికల్లో గెలవలేని వారు..” సోనియాగాంధీపై ప్రధాని కామెంట్స్..
PM Modi: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఎన్నికల్లో గెలవలేని వారు, రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులు అయ్యారు.’’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న, సోనియాగాంధీ సిట్టింగ్ స్థానమైన ఉత్తర్ ప్రదేశ్లోని రాయ్ బరేలీని వదిలేసి, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ ఈ ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, 2024 లోక్సభ ఎన్నికల ముందు ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.
Read Also: Sunita Kejriwal: కేజ్రీవాల్ భార్య సంచలన ఆరోపణలు.. భోజనంపై నిఘా, చంపేందుకు కుట్ర..
Also Read
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ పోటీ చేస్తున్న జాలోర్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి లుంబరం చౌదరి తరుపున ప్రధాని మోడీ ఆదివారం ప్రచారం చేశారు. రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలను ప్రధాని మోదీ ప్రశ్నించారు. ‘‘రాజస్థాన్ నుంచి ఒక దక్షిణాది నేతను కాంగ్రెస్ రాజ్యసభకు పంపింది. ఆయన ఎప్పుడూ రాజస్థాన్ గురించి మాట్లాడలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ని కూడా రాజ్యసభకు పంపారు. మీరు ఆయనను రాజస్థాన్లో చూశారా..? మరి ఇప్పుడు ఎన్నికల్లో పోరాడి గెలవలేని వారిని రక్షించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వచ్చారు.’’ అని సోనియాగాంధీ పేరు చెప్పకుండా విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం రాజ్యసభకు రాజస్థాన్ నుంచి ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు సోనియా గాంధీ, నీరజ్ డాంగి, రణదీప్ సింగ్ సూర్జేవాలా, KC వేణుగోపాల్, ప్రమోద్ తివారీ, ముకుల్ వాస్నిక్,. అయితే, వీరిలో డాంగీ మాత్రమే రాజస్థాన్కి చెందిన వారు. గత రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ని శిక్షించారని అన్నారు.
తాజావార్తలు
-
Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..
-
IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్పై సంచలన ఆరోపణలు.. స్లాప్గేట్ మళ్లీ వార్తల్లో
-
AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?
-
Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!
-
Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!