Arvind Kejriwal: కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో కొత్త పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం, కేజ్రీవాల్ కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన మనీష్ సిసోడియాను గురించి తలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. గత ఫిబ్రవరి నెల నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
ఈ కార్యక్రమంలో సిసోడియా గురించి తీవ్ర భావోద్వేగానికి గురైన సీఎం కేజ్రీవాల్, తన కన్నీటిని తుడుచుకుంటూ.. ప్రతీ బిడ్డకు ఉత్తమమైన విద్యను అందించాలని మనీష్ సిసోడియా కలగన్నారని, అతను మంచి పాఠశాలలు నిర్మించి, పిల్లలకు సరైన విద్యకు భరోసా ఇచ్చినందకు ఆయన జైలు పాలయ్యారని అన్నారు. బీజేపీని పరోక్షంగా ఉద్దేశిస్తూ.. వారు విద్యారంగంలో ఢిల్లీ విప్లవం ముగియాలని కోరుకుంటున్నారని, దాన్ని మేం జరగనివ్వమని కేజ్రీవాల్ అన్నారు.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
Read Also: Ganja Seller: వెలుగులోకి చీకటి వ్యాపారం.. పానీపూరి చాటున గంజాయి విక్రయం
మరోవైపు కేజ్రీవాల్ ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఢిల్లీ అధికారులు బదిలీ, నియామకం అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై.. కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో మరోసారి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంక్షోభం ఏర్పడింది. ఆర్డినెన్స్ చట్టంగా మారాలంటే ఆరు నెలల్లో పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్రానికి లోక్ సభలో మెజారిటీ ఉంది. రాజ్యసభలో మెజారిటీ లేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఆర్డినెన్స్ చట్టంగా మారడాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతోంది ఆప్. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) వర్గం నేత ఉద్దవ్ ఠాక్రేలను కలుసుకుని మద్దతు తెలపాలని కేజ్రీవాల్ కోరారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ను కలుసుకోనున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కేజ్రీవాల్ కు మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal gets emotional, as he remembers former education minister Manish Sisodia and his work in the area of education, at the inauguration of an educational institution pic.twitter.com/BDGSSbmpbq
— ANI (@ANI) June 7, 2023
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?