The Kerala Story: మంత్రులతో కలిసి సినిమా చూడనున్న సీఎం యోగి.. మరోవైపు బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ‘కేరళ స్టోరీ’ విడుదలకు ముందే వివాదాస్పదం అయింది. గత శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమాను తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ సినిమాకు టాక్సును రద్దు చేసింది. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, తన మంత్రి వర్గంతో కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పిస్తున్నట్లు యోగి స్వయంగా ప్రకటించారు. దీని గురించి ఆయన హిందీలో ట్వీట్ చేశారు. యోగి క్యాబినెట్ మొత్తం ఈ సినిమాను చూడాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో బీజేపీ పాలిత రాష్ట్ర ఉత్తరాఖండ్ కూడా ఈ సినిమాకు ‘టాక్స్ ఫ్రీ’ కల్పించేందుకు సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి పుష్కర్ సింగ్ ధామి ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. సీఎం ధామి మంగళవారం సాయంత్రం 5 గంటలకు డెహ్రాడూన్ లోని పీవీఆర్ థియేటర్ లో సినిమా చూసే అవకాశం ఉంది. ఆయనతో పాటు కేబినెట్ మంత్రి గణేష్ జోషి కూడా ఉండనున్నారు.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
Read Also: Revanth Reddy: అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేదు..!
మూవీ మేకర్స్ కి బెదిరింపులు..
ఇదిలా ఉంటే ఈ సినిమాను కొన్ని వర్గాల ప్రజలు సమర్థిస్తుంటే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం సంస్థలు, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, డీఎంకే పార్టీలు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా మేకర్స్ బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్, ఇతరులకు తెలియని నెంబర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ‘‘ఒంటరిగా బయటకు వెళ్లొద్దు, మీరు మంచి పనులు చేయలేదు’’ అని అఘాంతకుడు బెదిరించాడు. ఈ బెదిరింపులపై సుదీప్తో సేన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివాదం ఇది..
కేరళ స్టోరీ సినిమా మతమార్పిడులు, లవ్ జిహాద్, ఉగ్రవాదం ఇతివృత్తంగా రూపొందించబడింది. కేరళలో 32,000 హిందూ, క్రిస్టియన్ యువతులు మతమార్పిడికి గురయ్యారని, ఇందులో కొంత మంది ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరారని సినిమాలో చూపించారు. ఐసిస్ లో పనిచేసేందుకు సిరియాకు వెళ్లారని సినిమా ట్రైలర్ లో చూపించడం వివాదాస్పదం అయింది.
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!