Rahul Gandhi: ‘‘భారత రాజ్యాంగం 1000 ఏళ్ల పాతది’’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు..
- ‘‘రాజ్యాంగం 1000 ఏళ్ల నాటిది’’..
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ‘‘భారత రాజ్యాంగం 1000 ఏళ్ల పాతది’’ అని రాహుల్ గాంధీ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగం బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, సంత్ కబీర్ ఆలోచనల్ని కలిగి ఉందని అన్నారు. పాట్నాలో జరిగిన ‘‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’’ కార్యక్రమంలో రామహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ పార్టీ నేత సుధాన్షు త్రివేది రాహుల్ గాంధీని ఎగతాళి చేస్తూ.. ఆయన తన ‘జ్ఞానం’తో దేశాన్ని షాక్కి గురిచేస్తున్నారని, నోట మాట కూడా లేకుండా చేస్తున్నారని అన్నారు. 1947లో రాజ్యాంగం రూపొందించలేదని, కేవలం రాజ్యాంగ రూపకల్పన కార్యక్రమాలు మొదలయ్యాయనే విషయం కూడా రాహుల్ గాంధీకి తెలియలేదని అన్నారు. నవంబర్ 26, 1949న రాజ్యాంగం ఖరారందని, అందుకే ఈ తేదీని ప్రధాని మోడీ రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారని చెప్పారు.
Also Read
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
Read Also: Srinivasa Reddy: ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రైవేట్ పరం చేసి పేదల దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారు
ఇది తెలియని వారి కోసమే రాజ్యాంగ దినోత్సవం అవసరమైందని, కాంగ్రెస్ రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా స్వాగతించడం లేదని, వ్యతిరేకిస్తోందని త్రివేది అన్నారు. రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం ఎప్పుడు ఏర్పడిందో తెలియని వారి జాబితాలో చేరారని, అందుకు ఆయన వెయ్యి సంవత్సరాల పురాతనమైందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ కూడా రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ తన ఆత్మకథను రాస్తే దానికి ‘‘ఫెయిల్యూర్ టూ లాంచ్’’ అనే పేరు ఉంటుందని అన్నారు. రాజ్యాంగం ఎప్పుడు రాయబడిందో, అమలు చేయబడిందో తెలియని రాహుల్ నేడు కాంగ్రెస్కి నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ 55 కంటే ఎక్కువ ఎన్నికల్లో ఓడిపోయిందని, 400 కంటే ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు పార్టీని విడిచిపెట్టారని అన్నారు. ప్రధాని కావాలని కలలు కంటున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి తెలియకపోవడం సిగ్గుచేటని బీజేపీ నేత అజయ్ అలోక్ అన్నారు.
తాజావార్తలు
-
IPL 2026 Final: “గెలిచినా.. ఓడినా జాగ్రత్త”.. ఐపీఎల్ ఫైనల్కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్కు బిగ్ వార్నింగ్..
-
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
-
Peddi Pre-Release Event : ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
-
Mamata Banerjee: “ఇక మేమేంటో చూపిస్తాం”.. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..