కరోనా టీకాల ఎగుమతుల జాబితాలోకి భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా 22.45 కోట్లకుపైగా టీకా డోసుల నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మిగులు డోసులు ఉండటం తో టీకా వాణిజ్యపర ఎగుమతులపై కేంద్రప్రభుత్వం త్వరలోనే నిర్ణ యం తీసుకునే అవకాశం ఉంది. నవంబర్ నెలలో దాదాపు 31 కోట్ల డోసుల్ని డెలివరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 20నుంచి 22 కోట్ల డోసుల కంటే ఎక్కువ పంపిణీ చేస్తాయని అనుకోవడం లేదు. మిగిలిన వాటిని ఎగుమతి చేస్తామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. డిసెంబర్ నాటికి నిల్వ డోసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోపక్క కోటి డోసులు ఎగుమతి చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్కు కేంద్రం అను మతి ఇచ్చింది. భారత్ మార్చి 25వరకు కొవాగ్జిన్ 28 మిలియన్ డోసు ల్ని సరఫరా చేసింది. అదే నెలలో మరో 28 మిలియన్ డోసులు, ఏప్రిల్ నెలలో 50 మిలియన్ల డోసుల్ని ఎగుమతి చేయాలని భావిం చింది. కానీ ఆసమయంలో భారత్ కరోనా సెకండ్ వేవ్లో చిక్కు కుంది. దాంతో టీకాల ఎగుమతి నిలిచిపోయింది.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. మరోపక్క కోవాగ్జిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థనుంచి అనుమతులు వచ్చాయి. దాం తో కోవాగ్జిన్ టీకాలను ఇతర దేశాలకు సరఫరా చేయనున్నట్టు ఒక అధికారి వెల్లడించారు. వాణిజ్యపరంగా టీకా ఎగుమతులపై ఆలోచి స్తున్నట్లు పేర్కొన్నారు. బయోలాజికల్-ఇ టీకా కార్బివ్యాక్స్ కూడా డిసెంబర్లో అత్యవసర వినియోగ అనుమతులు పొందే అవకాశం ఉంది. అయితే ఈ టీకాలను ఇతర దేశాల సరఫరాకే వినియోగించ నున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 82 శాతం మంది ప్రజలు మొదటిడోసు, 42శాతం మంది రెండో డోసు వేయించుకు న్నారు. అంటే కనీసం 82శాతం మంది కార్బివ్యాక్సిన్ను వేయించు కునే వీలు లేదు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు టీకా డోసుల కోసం వేచి చూస్తున్నాయి. సుమారు 195 దేశాల్లో 40దేశాలు మాత్రమే 75 శాతం టీకా డోసుల్ని అందించగలిగాయి. మిగిలిన 150 దేశాలు 30 శాతమే వేసినట్టు కార్బివ్యాక్స్ గురించి ఒక అధికారి సమాధానంగా చెప్పారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?