Lover: ప్రేయసి కోసం కాస్లీ గిఫ్ట్.. అందుకోసం ఏం చేశాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lover: ప్రతి ఒక్కరూ ప్రేమ కోసం, ప్రియురాలిని మెప్పించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తారు. తన వైపు తిప్పుకునేందుకు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తుంటారు. అయితే ప్రియురాలిని తనవైపు తిప్పుకునేందుకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు దొంగతనాలకు తెర తీశాడు. ఆమెకు బహుమతులు ఇచ్చేందుకు దొంగతనం చేసి ప్రియురాలికి రూ. 60 లక్షల విలువైన బహుమతిని ఇచ్చాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో దంపతులతో పాటు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో చోటుచేసుకుంది. 22 ఏళ్ల పరాస్ తివారీ 24 ఏళ్ల మహిమా సింగ్తో ప్రేమలో పడ్డాడు. ఆమెను ఆకట్టుకునేందుకు, ఆమె కోరికలు తీర్చుకునేందుకు దొంగతనానికి పాల్పడ్డాడు. ఇందుకోసం ప్రత్యేక ముఠాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి దొంగతనాలు, దోపిడీలు చేసేవారు. నగర శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేశారు. ముఖ్యంగా ఖరీదైన ఇళ్లు, నగల దుకాణాలు టార్గెంట్ చేస్తూ దొంగతనం చేసేవారు. దోచుకున్న డబ్బు, నగలను పరాస్ తివారీ తన స్నేహితురాలు మహిమా సింగ్కు ఇచ్చేవాడు. మరికొన్ని నగల దుకాణాల్లో వెండి, బంగారు ఆభరణాలు ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. పరాస్ తివారీ ముఠా ఇటీవల భారీ దోపిడీకి పాల్పడింది. దోచుకున్న సొమ్ములో నుంచి రూ. 60 లక్షలు తన స్నేహితురాలు మహిమా సింగ్కు బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో అసలు సమస్య మొదలైంది.
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
పోలీసులు కేసు నమోదు చేసి చోరీ, దోపిడీ కేసులన్నింటినీ దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దర్యాప్తు చేస్తున్న పోలీసుకలు తివారీ ముఠా గురించి తెలిసింది. దీంతో పోలీసులు చాకచక్యంగా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయం సమీపంలో పరాస్ తివారీ ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. 9 లక్షల డబ్బు, రూ.8 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఆయుధాలు, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా మొత్తం వ్యవహారం బయటపడింది. పరాస్ తివారీ, అతని స్నేహితురాలు మహిమా సింగ్తో పాటు మరో నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Part Time Jobs: పార్ట్ టైం జాబ్ పేరిట టెలిగ్రామ్ మెసేజ్.. లక్షలు కొట్టేసిన కేటుగాళ్ళు
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!