Lover: ప్రేయసి కోసం కాస్లీ గిఫ్ట్.. అందుకోసం ఏం చేశాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lover: ప్రతి ఒక్కరూ ప్రేమ కోసం, ప్రియురాలిని మెప్పించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తారు. తన వైపు తిప్పుకునేందుకు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తుంటారు. అయితే ప్రియురాలిని తనవైపు తిప్పుకునేందుకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు దొంగతనాలకు తెర తీశాడు. ఆమెకు బహుమతులు ఇచ్చేందుకు దొంగతనం చేసి ప్రియురాలికి రూ. 60 లక్షల విలువైన బహుమతిని ఇచ్చాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో దంపతులతో పాటు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో చోటుచేసుకుంది. 22 ఏళ్ల పరాస్ తివారీ 24 ఏళ్ల మహిమా సింగ్తో ప్రేమలో పడ్డాడు. ఆమెను ఆకట్టుకునేందుకు, ఆమె కోరికలు తీర్చుకునేందుకు దొంగతనానికి పాల్పడ్డాడు. ఇందుకోసం ప్రత్యేక ముఠాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి దొంగతనాలు, దోపిడీలు చేసేవారు. నగర శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేశారు. ముఖ్యంగా ఖరీదైన ఇళ్లు, నగల దుకాణాలు టార్గెంట్ చేస్తూ దొంగతనం చేసేవారు. దోచుకున్న డబ్బు, నగలను పరాస్ తివారీ తన స్నేహితురాలు మహిమా సింగ్కు ఇచ్చేవాడు. మరికొన్ని నగల దుకాణాల్లో వెండి, బంగారు ఆభరణాలు ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. పరాస్ తివారీ ముఠా ఇటీవల భారీ దోపిడీకి పాల్పడింది. దోచుకున్న సొమ్ములో నుంచి రూ. 60 లక్షలు తన స్నేహితురాలు మహిమా సింగ్కు బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో అసలు సమస్య మొదలైంది.
Also Read
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
పోలీసులు కేసు నమోదు చేసి చోరీ, దోపిడీ కేసులన్నింటినీ దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దర్యాప్తు చేస్తున్న పోలీసుకలు తివారీ ముఠా గురించి తెలిసింది. దీంతో పోలీసులు చాకచక్యంగా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయం సమీపంలో పరాస్ తివారీ ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. 9 లక్షల డబ్బు, రూ.8 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఆయుధాలు, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా మొత్తం వ్యవహారం బయటపడింది. పరాస్ తివారీ, అతని స్నేహితురాలు మహిమా సింగ్తో పాటు మరో నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Part Time Jobs: పార్ట్ టైం జాబ్ పేరిట టెలిగ్రామ్ మెసేజ్.. లక్షలు కొట్టేసిన కేటుగాళ్ళు
తాజావార్తలు
-
SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!