Lover: ప్రేయసి కోసం కాస్లీ గిఫ్ట్.. అందుకోసం ఏం చేశాడంటే..?
Lover: ప్రతి ఒక్కరూ ప్రేమ కోసం, ప్రియురాలిని మెప్పించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తారు. తన వైపు తిప్పుకునేందుకు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తుంటారు. అయితే ప్రియురాలిని తనవైపు తిప్పుకునేందుకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు దొంగతనాలకు తెర తీశాడు. ఆమెకు బహుమతులు ఇచ్చేందుకు దొంగతనం చేసి ప్రియురాలికి రూ. 60 లక్షల విలువైన బహుమతిని ఇచ్చాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో దంపతులతో పాటు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో చోటుచేసుకుంది. 22 ఏళ్ల పరాస్ తివారీ 24 ఏళ్ల మహిమా సింగ్తో ప్రేమలో పడ్డాడు. ఆమెను ఆకట్టుకునేందుకు, ఆమె కోరికలు తీర్చుకునేందుకు దొంగతనానికి పాల్పడ్డాడు. ఇందుకోసం ప్రత్యేక ముఠాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి దొంగతనాలు, దోపిడీలు చేసేవారు. నగర శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేశారు. ముఖ్యంగా ఖరీదైన ఇళ్లు, నగల దుకాణాలు టార్గెంట్ చేస్తూ దొంగతనం చేసేవారు. దోచుకున్న డబ్బు, నగలను పరాస్ తివారీ తన స్నేహితురాలు మహిమా సింగ్కు ఇచ్చేవాడు. మరికొన్ని నగల దుకాణాల్లో వెండి, బంగారు ఆభరణాలు ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. పరాస్ తివారీ ముఠా ఇటీవల భారీ దోపిడీకి పాల్పడింది. దోచుకున్న సొమ్ములో నుంచి రూ. 60 లక్షలు తన స్నేహితురాలు మహిమా సింగ్కు బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో అసలు సమస్య మొదలైంది.
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
- IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
పోలీసులు కేసు నమోదు చేసి చోరీ, దోపిడీ కేసులన్నింటినీ దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దర్యాప్తు చేస్తున్న పోలీసుకలు తివారీ ముఠా గురించి తెలిసింది. దీంతో పోలీసులు చాకచక్యంగా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయం సమీపంలో పరాస్ తివారీ ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. 9 లక్షల డబ్బు, రూ.8 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఆయుధాలు, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా మొత్తం వ్యవహారం బయటపడింది. పరాస్ తివారీ, అతని స్నేహితురాలు మహిమా సింగ్తో పాటు మరో నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Part Time Jobs: పార్ట్ టైం జాబ్ పేరిట టెలిగ్రామ్ మెసేజ్.. లక్షలు కొట్టేసిన కేటుగాళ్ళు
తాజావార్తలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
-
MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!