Pak Terrorist Captured: సరిహద్దుల్లో పట్టుబడ్డ ఉగ్రవాది.. సైన్యంపై దాడి చేస్తే రూ.30 వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist captured along LoC: జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ ఉగ్రవాది పట్టుబడ్డాడు. సరిహద్దులు దాటి భారత సైన్యంపై దాడి చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా చొరబాటుదారుల కదలికలు ఎక్కువయ్యాయి. ఆగస్టు 21న నౌషేరాలోని ఝంగర్ సెక్టార్ లో నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాదులను కదలికను సైన్యం గుర్తించింది. కంచెను కత్తెరించి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే సైనికులు కాల్పుల జరపడంతో ఒకరు గాయపడ్డారు. అతన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మరో ఇద్దరు సరిహద్దుల్లో అడవుల గుండా పాకిస్తాన్ లోకి పారిపోయారు.
ప్రస్తుతం గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందిస్తున్నారు. పట్టుబడిన ఉగ్రవాది పాకిస్తాన్ లోని పీఓకే లోని కోట్లీ జిల్లా సబ్ కోట్ గ్రామానికి చెందిన తబారక్ హుస్సెన్ గా గుర్తించారు. ఇండియన్ ఆర్మీ పోస్టులపై దాడుల చేసేందుకు వచ్చామని వెల్లడించాడు. కల్నల్ యూనస్ చౌదరి అనే పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన కల్నల్ తనను పంపాడని.. తనకు రూ. 30,000 పాకిస్తానీ కరెన్సీ ఇచ్చి, ఇండియన్ ఆర్మీపై దాడుడు చేయాలని చెప్పాడని ఒప్పుకున్నాడు. గతంలో ఇలాగే 2016లో ఇదే సెక్టార్ లో అతని సోదరుడు హరూన్ అలీతో కలిసి తబారక్ హుస్సెన్ సరిహద్దు దాటిన సమయంలో మానవత కారణాలతో పాకిస్తాన్ తిప్పి పంపారు. ఆ తరువాత 2017లో మరోసారి ఇలాగే పట్టుబడితే మళ్లీ పాకిస్తాన్ పంపించారు.
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
Read Also: Zomato: జొమాటోకు షాక్.. ఆర్డర్ క్యాన్సిల్ చేసిన పాపానికి..
ఇదిలా ఉంటే ఆగస్టు 22-23న నౌషేరా జిల్లాలోని లామ్ సెక్టార్ లో ఇద్దరు, ముగ్గురు టెర్రరిస్టులు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. భారత సైన్యం వీరి కదలికలను గుర్తించింది. అయితే సరిహద్దు సమీపంలో ఉన్న ల్యాండ్ మైన్స్ పేలడంతో ఇద్దరు టెర్రరిస్టులు మరణించగా.. మరో ఉగ్రవాది గాయపడ్డాడని తెలుస్తోంది. గాయపడిన ఉగ్రవాది సమీపంలో ఎక్కడైనా దాక్కుని ఉండవచ్చని సైన్యం వెల్లడించింది. 48 గంటల్లోనే భారత్ ఆర్మీ లక్ష్యంగా చొరబాట్లు జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ సహకారంతోనే ఈ చొరబాట్లు జరుగుతున్నాయని పట్టుబడిన ఉగ్రవాది వెల్లడించాడు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే ధన నష్టం తప్పదు.. వాస్తు ఏం చెబుతోంది..?
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!