Zomato: జొమాటోకు షాక్.. ఆర్డర్ క్యాన్సిల్ చేసిన పాపానికి..
Zomato: ఎవరైనా ఆకలేస్తే ఏదో ఒకటి తినాలనుకుంటారు. ఇంట్లో వంట చేయకపోతే దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ లేదా హోటల్, బేకరీకి వెళ్లి ఏదో ఒకటి తింటారు. ప్రస్తుతం కాలంలో చాలా మంది ఫుడ్ డెలివరీ చేసుకుని ఆస్వాదిస్తున్నారు. కొన్ని సార్లు మాత్రం ఆ ప్రాంతంలో డెలివరీ పార్టనర్స్ అందుబాటులో లేకపోవడం, రెస్టారెంట్లో ఆర్డర్ చేసిన భోజనం అందుబాటులో లేకపోతే ఫుడ్ డెలివరీ సర్వీసెస్ అందించే సంస్థ ఆర్డర్ను క్యాన్సిల్ చేస్తుంటుంది. ఇలా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అసలే ఆకలితో బాధపడుతుంటే.. ఆర్డర్ చేసి ఫుడ్ క్యాన్సిల్ అయితే అప్పుడు వచ్చే కోపం వేరుగా ఉంటుంది. అలా కస్టమర్ అనుమతి లేకుండా ఆర్డర్ చేసిన ఫుడ్ క్యాన్సిల్ చేసినందుకు జొమాటో సంస్థకు చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల కమిషన్ షాకిచ్చింది. ఆర్డల్ క్యాన్సిల్ చేసినందుకు రూ.10వేల జరిమానా చెల్లించాలని ఆదేశించడంతో పాటు ఒకరోజు ఉచితంగా భోజనాన్ని అందించాలని ఆదేశించింది. 2020లో చండీగఢ్ లో జరిగిన ఘటనకు సంబంధించిన ఈకేసులో చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తాజాగా తీర్పు వెలువరించింది.
చండీగఢ్కు చెందిన అజయ్కుమార్ శర్మకు రాత్రి 10.30 గంటల సమయంలో బాగా ఆకలేసింది. వెంటనే ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో పిజ్జా ఆర్డర్ చేశాడు. ఇన్టైంలో ఆర్డర్ చేయడానికి సేవా రుసుము కూడా చెల్లించాడు. అన్ని ట్యాక్స్లు కలుపుకుని రూ.287 బిల్లు కాగా.. బుక్ చేసిన కాసేపటికే ఆర్డర్ క్యాన్సిల్ అయిందంటూ సందేశం వచ్చింది. వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని తిరిగి అకౌంట్లో జమ చేసినట్లు తెలిపింది. సమయానికి ఆర్డర్ ఇవ్వకపోవడంతో పాటు క్యాన్సిల్ చేయడంతో అజయ్శర్మకు ఆగ్రహాన్ని తెప్పించింది. తన అనుమతి లేకుండా క్యాన్సిల్ చేయడంతో తొలుత జిల్లా వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేయగా.. ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కమిషన్ అజయ్ శర్మకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
Ananya Panday: నాటీ బాయ్.. అది చేయమంటే దగ్గరకు లాక్కొని బుగ్గ కొరికాడంట
అజయ్కుమార్ శర్మ తన పిల్లల కోసం ఆర్డర్ చేశాడని.. రాత్రివేళ ఆర్డర్ క్యాన్సిల్ కావడం వల్ల అతను ఇబ్బందులకు గురయ్యాడని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అభిప్రాయపడింది. ఆర్డల్ క్యాన్సిల్ చేసినందుకు రూ.10వేల జరిమానా చెల్లించాలని ఆదేశించడంతో పాటు ఒకరోజు ఉచితంగా భోజనాన్ని అందించాలని ఆదేశించింది. సమయానికి ఆర్డర్ డెలివరీ చేయలేనప్పుడు ప్రకటనలు ఇవ్వొద్దని సంస్థకు సూచించింది.
తాజావార్తలు
-
Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో