Heat Wave Warning: భానుడి భగభగ.. వచ్చే ఐదు రోజుల్లో 3-5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heat Wave Warning: ఏప్రిల్ రెండో వారమే దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న సమయాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పటికే భారత వాతావరణ శాఖ(IMD) వచ్చే పది రోజుల్లో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుందని ఇప్పటికే హెచ్చరించింది. ఇదిలా ఉంటే వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది.
Read Also: Maheshwer reddy: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి..
Also Read
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
రానున్న 4-5 రోజుల్లో ఈశాన్య భారతంతో పాటు పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం కన్నా గరిష్ట ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 13 నుంచి 17 వరకు గంగా తీర పశ్చిమ బెంగాల్, 13 నుంచి 15 మధ్య ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 15-17 మధ్య బీహార్ మీదుగా హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. రాబోయే ఐదు రోజుల్లో గోవా, మధ్యప్రదేశ్ , మహారాష్ట్రల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఐఎండీ ప్రకారం 1901లో నుంచి ఈ ఏడాది ఫిబ్రవరినే హాటెస్ట్ ఫిబ్రవరిగా నమోదు అయింది. దేశ రాజధాని ఢిల్లీలో వడగాలుల కారణంగా పాఠశాలల సన్నద్ధతపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీరప్రాంతాల్లో పెరుగుతున్న ఎండల దృష్ట్యా అన్ని అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఏప్రిల్ 12 నుంచి 16 వరకు మూసేయాలని ఆదేశించారు. మరోవైపు ఏసీలు, ఏయిర్ కూలర్ల వినియోగం పెరగడంతో విద్యుత్ వినియోగం గరిష్టానికి చేరుకుంది. దీంతో పవర్ లోడ్ ఎక్కువగా అవుతోంది.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..