Tejashwi Yadav: ఆయనే బలమైన ప్రధాన మంత్రి అభ్యర్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav comments, Nitish Kumar might be ‘strong candidate’ for PM: ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి.. ధీటైన ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మోదీకి ధీటైన ప్రధాన మంత్రి అభ్యర్థి అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు పరిగణలోకి తీసుకుంటే.. నితీష్ కుమార్ బలమైన ప్రధాన మంత్రి అభ్యర్థి కాగలరని అన్నారు.
బీహర్ లో ఆర్జేడీ-జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జంగిల్ రాజ్ వస్తుందని బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. బీజేపీ విమర్శలను ‘ అలసిపోయిన ఉపన్యాసం’, ‘ఏడ్చే తోడేళ్లు’ అని విమర్శించారు. బీహార్ లోని మహాఘటబంధన్ ప్రభుత్వం విపక్షాల ఐక్యతకు మంచి సూచన అని ఆయన అన్నారు. బీజేపీ ఆధిపత్యాన్ని చాలా ప్రతిపక్ష పార్టీలు గుర్తించాయని.. డబ్బు, మీడియా, పాలనా యంత్రాంగాన్ని ఉపయోగించుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని ఆయన విమర్శించారు. కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి బీజేపీవన్నీ మాటలే అని.. ప్రాంతీయ అసమానతలను బీజేపీ విస్మరిస్తోందని తేజస్వీయాదవ్ అన్నారు. నితీష్ కుమార్ 37 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని కలిగి ఉండటంతో పాటు ప్రజల అభిమానాలు కలిగి ఉన్నారని అన్నారు.
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
Read Also: Hrithik Roshan Zomato Ad Controversy: హృతిక్ రోషన్ ప్రకటనపై జొమాటో క్షమాపణ
ఇటీవల ఎన్డీయే నుంచి నితీష్ కుమార్ జేడీయూ పార్టీ బయటకు వచ్చింది. బీజేపీతో అధికారాన్ని పంచుకున్న జేడీయూ ఆ బంధానికి స్వస్తి పలికింది. ఆర్జేడీ పార్టీతో జతకలిసి మళ్లీ అధికారాన్ని చేపట్టింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేయగా.. ఆర్జేడీ నేత, లాలూ కుమార్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం ప్రతిపక్షంలోకి మారింది. ఇటీవల ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ పార్టీ కూటమిలో 31 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
తాజావార్తలు
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!