Tejashwi Yadav: మహిళలకు తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ
- బీహార్లో రసవత్తరంగా సాగుతున్న ప్రచారం
- మహిళలకు తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఎన్నికల వేళ మహిళ ఓటర్లే లక్ష్యంగా మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ కురిపించారు. ఎల్పీజీ సిలిండర్ను రూ.500కే ఇస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం సిమ్రీ భక్తియార్పూర్లో తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.500కు తగ్గిస్తుందని.. అలాగే వృద్ధాప్య పెన్షన్ను రూ.1,500కు పెంచుతుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా బీహార్ ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగాలు కల్పిస్తుందని, ప్రజల సమస్యలను మా ప్రభుత్వం వింటుందని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: విపక్ష కూటమిలో ఉన్నవారంతా నేరస్థులే.. బీహార్ ర్యాలీలో మోడీ ధ్వజం
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
బీహార్లో అవినీతిపరులైన నాయకులను, నేరస్థులను కేంద్రం కాపాడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే తాను స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని అందిస్తానని తెలిపారు. ప్రజల ఫిర్యాదులను వినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, వారికి అందుబాటు ధరల్లో మందులు, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: PM Modi: భారతరత్న కర్పూరి ఠాకూర్కు నివాళులర్పించి బీహార్లో మోడీ ప్రచారం ప్రారంభం
‘జంగల్ రాజ్’పై మోడీ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ.. ‘‘నితీష్ కుమార్ ప్రభుత్వం చేసిన 55 కుంభకోణాలను ప్రధానమంత్రి మోడీ స్వయంగా వివరించారు. ఆయన ఏ చర్య తీసుకున్నారు? ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు భారతదేశంలో అత్యధిక నేరపూరిత కార్యకలాపాలకు సాక్ష్యంగా ఉన్నాయని ఆరోపించారు.
‘‘నేను అర్ధ సత్యాలు, అబద్ధాలు చెప్పను. నేను చేసేదే చెబుతానని మీ అందరికీ తెలుసు. ఇండియా కూటమి ఎన్నికల్లో గెలిస్తే.. తేజస్వి యాదవ్ ప్రజల ముఖ్యమంత్రి అవుతారు. నేరాలు జరగకుండా చూస్తాను. బీహార్లో అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తాను. మా ప్రభుత్వం బీహార్ ప్రజలకు విద్య, మందులు, ఉద్యోగాలను ఇస్తుంది. మా ప్రభుత్వం ప్రజల ఫిర్యాదులను వింటుంది.’’ అని తేజస్వి యాదవ్ అన్నారు.
తేజస్వి యాదవ్ ఇప్పటికే అనేక హామీలు కుమ్మరించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే జీవికా దీదీలను పర్మినెంట్ చేసి.. ప్రతి నెల రూ.30,000 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రత్యేక రుణాలు కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు.
విపక్ష కూటమిలో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమిసిపోయింది. గురువారం మహాఘట్బంధన్ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ను ఇండియా కూటమి ప్రకటించింది. దీంతో కూటమిలో నెలకొన్న విభేదాలు పోయి.. అంతా ఐక్యంగా ఉన్నట్లు సందేశం ఇచ్చారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!