Tejashwi Yadav: మహిళలకు తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ
- బీహార్లో రసవత్తరంగా సాగుతున్న ప్రచారం
- మహిళలకు తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఎన్నికల వేళ మహిళ ఓటర్లే లక్ష్యంగా మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ కురిపించారు. ఎల్పీజీ సిలిండర్ను రూ.500కే ఇస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం సిమ్రీ భక్తియార్పూర్లో తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.500కు తగ్గిస్తుందని.. అలాగే వృద్ధాప్య పెన్షన్ను రూ.1,500కు పెంచుతుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా బీహార్ ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగాలు కల్పిస్తుందని, ప్రజల సమస్యలను మా ప్రభుత్వం వింటుందని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: విపక్ష కూటమిలో ఉన్నవారంతా నేరస్థులే.. బీహార్ ర్యాలీలో మోడీ ధ్వజం
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
బీహార్లో అవినీతిపరులైన నాయకులను, నేరస్థులను కేంద్రం కాపాడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే తాను స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని అందిస్తానని తెలిపారు. ప్రజల ఫిర్యాదులను వినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, వారికి అందుబాటు ధరల్లో మందులు, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: PM Modi: భారతరత్న కర్పూరి ఠాకూర్కు నివాళులర్పించి బీహార్లో మోడీ ప్రచారం ప్రారంభం
‘జంగల్ రాజ్’పై మోడీ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ.. ‘‘నితీష్ కుమార్ ప్రభుత్వం చేసిన 55 కుంభకోణాలను ప్రధానమంత్రి మోడీ స్వయంగా వివరించారు. ఆయన ఏ చర్య తీసుకున్నారు? ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు భారతదేశంలో అత్యధిక నేరపూరిత కార్యకలాపాలకు సాక్ష్యంగా ఉన్నాయని ఆరోపించారు.
‘‘నేను అర్ధ సత్యాలు, అబద్ధాలు చెప్పను. నేను చేసేదే చెబుతానని మీ అందరికీ తెలుసు. ఇండియా కూటమి ఎన్నికల్లో గెలిస్తే.. తేజస్వి యాదవ్ ప్రజల ముఖ్యమంత్రి అవుతారు. నేరాలు జరగకుండా చూస్తాను. బీహార్లో అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తాను. మా ప్రభుత్వం బీహార్ ప్రజలకు విద్య, మందులు, ఉద్యోగాలను ఇస్తుంది. మా ప్రభుత్వం ప్రజల ఫిర్యాదులను వింటుంది.’’ అని తేజస్వి యాదవ్ అన్నారు.
తేజస్వి యాదవ్ ఇప్పటికే అనేక హామీలు కుమ్మరించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే జీవికా దీదీలను పర్మినెంట్ చేసి.. ప్రతి నెల రూ.30,000 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రత్యేక రుణాలు కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు.
విపక్ష కూటమిలో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమిసిపోయింది. గురువారం మహాఘట్బంధన్ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ను ఇండియా కూటమి ప్రకటించింది. దీంతో కూటమిలో నెలకొన్న విభేదాలు పోయి.. అంతా ఐక్యంగా ఉన్నట్లు సందేశం ఇచ్చారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!