Tamilnadu: బీజేపీ ఆఫీసుపై బాంబు దాడి.. ఇలాంటివి మమ్మల్ని అడ్డుకోలేవన్న అన్నామలై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol bomb hurled at BJP office in Coimbatore: తమిళనాడులో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. కోయంబత్తూర్ నగరంలో బీజేపీ ఆఫీసుపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు దుండగులు. గురువారం రాత్రి 8.40 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు న్యూ సిదాపుదూర్ లోని వీకే మీనన్ రోడ్డులోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. అయితే పెట్రోల్ బాంబు పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. పెట్రోల్ బాంబుకు మంటలు అంటుకోకపోవడంతో అది పేలలేదు. కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలో బాంబును దుండగులు విసిరేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
ఈ ఘటన జరిగిన వెంటనే నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమీషనర్ వి బాలకృష్ణన్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు నిరసనగా గాంధీపురం జంక్షన్ లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఘటనకు కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఉగ్రవాదుల కుట్రే అని బీజేపీ ఆరోపించింది.
Also Read
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
Read Also: Earthquake Indonesia: ఇండోనేషియాలో 4.7 తీవ్రతతో భారీ భూకంపం
తమిళనాడు వ్యాప్తంగా పీఎఫ్ఐ,ఎస్డీపీఐ సంస్థలపై గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మెరుపుదాడులు చేసింది. ఈ ఘటనను ఖండించారు కొంతమంది మైనారిటీ నేతలు. దీనికి వ్యతిరేకంగానే కోయంబత్తూర్ లో రెండు ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఒప్పనకర వీధిలోని ఓ వస్త్ర దుకాణంపై పెట్రోల్ బాంబు విసిరారు.. ఆ తరువాత బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు.
ఇదిలా ఉంటే ఈ దాడిపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. కోయంబత్తూర్ కార్యాలయంపై దాడి మా కార్యకర్తలను భయపెట్టలేవని.. ఇది సమాజానికి, దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలనే మా సంకల్పాన్ని పెంచుతుందని.. ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!