Tamilnadu: బీజేపీ ఆఫీసుపై బాంబు దాడి.. ఇలాంటివి మమ్మల్ని అడ్డుకోలేవన్న అన్నామలై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol bomb hurled at BJP office in Coimbatore: తమిళనాడులో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. కోయంబత్తూర్ నగరంలో బీజేపీ ఆఫీసుపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు దుండగులు. గురువారం రాత్రి 8.40 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు న్యూ సిదాపుదూర్ లోని వీకే మీనన్ రోడ్డులోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. అయితే పెట్రోల్ బాంబు పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. పెట్రోల్ బాంబుకు మంటలు అంటుకోకపోవడంతో అది పేలలేదు. కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలో బాంబును దుండగులు విసిరేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
ఈ ఘటన జరిగిన వెంటనే నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమీషనర్ వి బాలకృష్ణన్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు నిరసనగా గాంధీపురం జంక్షన్ లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఘటనకు కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఉగ్రవాదుల కుట్రే అని బీజేపీ ఆరోపించింది.
Also Read
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
Read Also: Earthquake Indonesia: ఇండోనేషియాలో 4.7 తీవ్రతతో భారీ భూకంపం
తమిళనాడు వ్యాప్తంగా పీఎఫ్ఐ,ఎస్డీపీఐ సంస్థలపై గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మెరుపుదాడులు చేసింది. ఈ ఘటనను ఖండించారు కొంతమంది మైనారిటీ నేతలు. దీనికి వ్యతిరేకంగానే కోయంబత్తూర్ లో రెండు ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఒప్పనకర వీధిలోని ఓ వస్త్ర దుకాణంపై పెట్రోల్ బాంబు విసిరారు.. ఆ తరువాత బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు.
ఇదిలా ఉంటే ఈ దాడిపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. కోయంబత్తూర్ కార్యాలయంపై దాడి మా కార్యకర్తలను భయపెట్టలేవని.. ఇది సమాజానికి, దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలనే మా సంకల్పాన్ని పెంచుతుందని.. ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?