Tamilnadu: బీజేపీ ఆఫీసుపై బాంబు దాడి.. ఇలాంటివి మమ్మల్ని అడ్డుకోలేవన్న అన్నామలై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol bomb hurled at BJP office in Coimbatore: తమిళనాడులో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. కోయంబత్తూర్ నగరంలో బీజేపీ ఆఫీసుపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు దుండగులు. గురువారం రాత్రి 8.40 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు న్యూ సిదాపుదూర్ లోని వీకే మీనన్ రోడ్డులోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. అయితే పెట్రోల్ బాంబు పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. పెట్రోల్ బాంబుకు మంటలు అంటుకోకపోవడంతో అది పేలలేదు. కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలో బాంబును దుండగులు విసిరేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
ఈ ఘటన జరిగిన వెంటనే నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమీషనర్ వి బాలకృష్ణన్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు నిరసనగా గాంధీపురం జంక్షన్ లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఘటనకు కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఉగ్రవాదుల కుట్రే అని బీజేపీ ఆరోపించింది.
Also Read
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
Read Also: Earthquake Indonesia: ఇండోనేషియాలో 4.7 తీవ్రతతో భారీ భూకంపం
తమిళనాడు వ్యాప్తంగా పీఎఫ్ఐ,ఎస్డీపీఐ సంస్థలపై గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మెరుపుదాడులు చేసింది. ఈ ఘటనను ఖండించారు కొంతమంది మైనారిటీ నేతలు. దీనికి వ్యతిరేకంగానే కోయంబత్తూర్ లో రెండు ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఒప్పనకర వీధిలోని ఓ వస్త్ర దుకాణంపై పెట్రోల్ బాంబు విసిరారు.. ఆ తరువాత బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు.
ఇదిలా ఉంటే ఈ దాడిపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. కోయంబత్తూర్ కార్యాలయంపై దాడి మా కార్యకర్తలను భయపెట్టలేవని.. ఇది సమాజానికి, దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలనే మా సంకల్పాన్ని పెంచుతుందని.. ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!