Madras Eye Effect: తమిళనాడుని వణికిస్తున్న మద్రాస్ ఐ.. లక్షణాలేంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్యకాలంలో అనారోగ్య సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి. తమిళనాడు ప్రజలను వణికిస్తున్న తాజా వ్యాధి మద్రాస్ ఐ. మనం దీనిని కండ్ల కలక అని చెప్పవచ్చు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి తమిళనాడులో విజృంభిస్తుంది ‘మద్రాస్ ఐ’ .. కంటి వాపు, ఎరుపు, వాపు ‘మద్రాస్ ఐ’ యొక్క లక్షణాలు. కుటుంబసభ్యుడు ప్రభావితమైతే, 4 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలంటున్నారు వైద్యులు. మద్రాసు ఐ అని పిలవబడే కండ్లకలక కేసులు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది.
‘మద్రాస్ ఐ’ అని పిలవబడే కండ్లకలక చెన్నైలో ముఖ్యంగా పిల్లలలో వేగంగా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం ముగిసే సమయానికి కండ్లకలక కేసులు ప్రభావం చూపిస్తాయి. ఈ సంవత్సరం చెన్నై నగరంలో సుదీర్ఘ వర్షపాతం కేసులోడ్ను మరింత పెంచింది. ఇటీవలి వారాల్లో 20శాతం మందికి పైగా యువకులు, పిల్లలు కండ్లకలక వ్యాధితో బాధపడుతున్నారు, మద్రాస్ ఐ అనేది ఒక వ్యక్తి నుండి మరొకరికి వేగంగా వ్యాపించే సాధారణ పరిస్థితి. ఇది తరచుగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది కంటి నుండి స్రావాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ విధంగా, ఒక వ్యక్తి అతని/ఆమె కంటిని తాకినట్లయితే, అతను/ఆమె ఇన్ఫెక్టివ్ వైరస్ లేదా బ్యాక్టీరియాను మరొక వ్యక్తికి వ్యాపించవచ్చు అంటున్నారు కంటి వైద్యులు.
Also Read
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
మద్రాస్ ఐ లక్షణాలేంటంటే?
* ఈ మద్యాస్ ఐ లేదా కండ్లకలక యొక్క సాధారణ లక్షణాలు చికాకుగా వుండడం
* కంటినుంచి నీరు బయటకు రావడం, కళ్ళు ఎర్రబడటం, జిగటగా వుండడం
* కొంతమంది రోగులలో వాపు మరియు మంటను కలిగించే అంటువ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్, నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
కండ్లకలక అనేది సాధారణంగా చిన్న కంటి ఇన్ఫెక్షన్ అయినప్పటికీ, సరిగ్గా రోగనిర్ధారణ చేయకపోతే మరియు వెంటనే చికిత్స చేయకపోతే ఇది మరింత తీవ్రమైన సమస్యగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఫార్మసీ నుండి యాంటీబయాటిక్స్ ప్రయత్నించిన తర్వాత డాక్టర్ వద్దకు వస్తారు. కానీ అలా చేయకూడదు. సరైన రోగ నిర్ధారణ తర్వాత కంటి నిపుణుడిచే సూచించబడిన యాంటీబయాటిక్స్, కంటి చుక్కలను వాడాలి.conjunctivitis అని పిలవబడే బ్యాక్టీరియా కారణంగా ఇది వ్యాపిస్తుంది. తువ్వాలు, దిండు కవర్లు మరియు మేకప్ వస్తువులు వంటి వ్యక్తిగత వస్తువుల ద్వారా ఇది ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. అందువల్ల, రోగులను ఒంటరిగా ఉంచడం చాలా ముఖ్యం.
వ్యాధి సోకిన రోగులు వారి కళ్ల నుండి ఏదైనా స్రావాలని తుడిచివేయడానికి మరియు వెంటనే న్యాప్కిన్లను పారవేయడానికి పేపర్ నాప్కిన్లను మాత్రమే ఉపయోగించాలి. వారు పాత కాంటాక్ట్ లెన్స్లను విస్మరించి, వైద్యులను సంప్రదించిన తర్వాతే కొత్త వాటిని ఉపయోగించడం ప్రారంభించాలి. ఈ వ్యాధి బారిన పడినవారు తరచుగా చేతులు కడుక్కోవాలి. ఈ అంటువ్యాధిని నివారించడానికి ఇతరులు తమ వ్యక్తిగత వస్తువులను ఉపయోగించకూడదు. పాఠశాలలు,కార్యాలయాలు వంటి చోట కండ్లకలక వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి, నీటి విడుదల పూర్తిగా ఆగిపోయే వరకు ప్రజలు బయటకు వెళ్లకూడదు. క్వారంటైన్లో ఉండడం మంచిదని వైద్యారోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!