Tamil Nadu: తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల పంజా.. వరద గుప్పిట చెన్నై నగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Witnesses Heavy Rain: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవితం అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా చెన్నై మహానగరం వరద గుప్పిట చిక్కుకుంది. చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని చాలా ప్రాంతాలు వరద నీరు చేరింది. సిటీలోని నుంగంబాక్కంలో నిన్న ఒకే రోజు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీంతో పాటు సబర్బన్ రెడ్ హిల్స్ 13 సెంటీమీటర్లు, పెరంబూర్ లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మూడు దశాబ్ధాల తరువాత ఈ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు వర్షాల వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు.
అక్టోబర్ 29 నుంచి ఈశాన్య రుతుపనాలు తమిళనాడులో ప్రారంభం అయ్యాయి. కావేరి డెల్టా ప్రాంతంలో పాటు కన్యాకుమారి తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని 8 జిల్లాకలు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కాంచీపురం, చెంగల్పట్టు, తంజావూర్ జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తిరువల్లూర్, నాగపట్టణం, మైలారుదురై జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
Also Read
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
Read Also: Kamal Movie Crazy Update: క్రేజీ అప్డేట్.. భారతీయుడు-2లో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి
చెన్నైలో వర్షాల దృష్ట్యా సీఎం ఎంకే స్టాలిన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. నగరంలోని సబ్ వేలను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించి భారీ వర్షాలపై సమీక్ష జరిపారు. వర్షాల ప్రభావంతో కావేరీ నది పొంగిపొర్లుతోంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర హెచ్చరిస్తోంది. రెడ్ అలెర్ట్ ప్రకటించిన 8 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.
చెన్నైలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. వర్షాల వల్ల ఓ వ్యక్తి విద్యుత్ షాక్ తో చనిపోతే.. మరో మహిళ ఇళ్లు కూలి మరణించింది. రామనాథపురం, శివగంగ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లద్దని ప్రభుత్వం సూచించింది. రానున్న మూడు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి-కారైకల్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయిని.. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్పట్టు, వెల్లూర్ సహా ఉత్తరాది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!