Tamil Nadu: తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల పంజా.. వరద గుప్పిట చెన్నై నగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Witnesses Heavy Rain: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవితం అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా చెన్నై మహానగరం వరద గుప్పిట చిక్కుకుంది. చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని చాలా ప్రాంతాలు వరద నీరు చేరింది. సిటీలోని నుంగంబాక్కంలో నిన్న ఒకే రోజు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీంతో పాటు సబర్బన్ రెడ్ హిల్స్ 13 సెంటీమీటర్లు, పెరంబూర్ లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మూడు దశాబ్ధాల తరువాత ఈ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు వర్షాల వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు.
అక్టోబర్ 29 నుంచి ఈశాన్య రుతుపనాలు తమిళనాడులో ప్రారంభం అయ్యాయి. కావేరి డెల్టా ప్రాంతంలో పాటు కన్యాకుమారి తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని 8 జిల్లాకలు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కాంచీపురం, చెంగల్పట్టు, తంజావూర్ జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తిరువల్లూర్, నాగపట్టణం, మైలారుదురై జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
Also Read
Read Also: Kamal Movie Crazy Update: క్రేజీ అప్డేట్.. భారతీయుడు-2లో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి
చెన్నైలో వర్షాల దృష్ట్యా సీఎం ఎంకే స్టాలిన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. నగరంలోని సబ్ వేలను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించి భారీ వర్షాలపై సమీక్ష జరిపారు. వర్షాల ప్రభావంతో కావేరీ నది పొంగిపొర్లుతోంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర హెచ్చరిస్తోంది. రెడ్ అలెర్ట్ ప్రకటించిన 8 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.
చెన్నైలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. వర్షాల వల్ల ఓ వ్యక్తి విద్యుత్ షాక్ తో చనిపోతే.. మరో మహిళ ఇళ్లు కూలి మరణించింది. రామనాథపురం, శివగంగ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లద్దని ప్రభుత్వం సూచించింది. రానున్న మూడు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి-కారైకల్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయిని.. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్పట్టు, వెల్లూర్ సహా ఉత్తరాది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!