Madras Eye: తమిళనాడును కలవరపెడుతున్న “మద్రాస్ ఐ” .. ప్రతిరోజూ 4 వేలకు పైగా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Sees ‘Madras Eye’ Surge, 1.5 lakh Conjunctivitis Cases In Monsoon: తమిళనాడు వ్యాప్తంతా ‘ మద్రాస్ ఐ ’ కేసుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ భాషలో చెప్పాలంటే ‘ కళ్ల కలక’గా ఈ వ్యాధిని వ్యవహరిస్తుంటారు. ఇప్పటి వరకు తమిళనాడు వ్యాప్తంగా 1.5 లక్షల కళ్లకలక కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజల్లో ఇన్ఫెక్షన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా మద్రాస్ ఐ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతీరోజూ 4,000 నుంచి 4,500 కేసులు నమోదు అవుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. ఒక్క చెన్నై నగరంలోనే రోజుకు 80 నుంచి 100 కేసులు నమోదు అవుతున్నాయి. ఈ వ్యాధి సోకిన వారు ఒంటరిగా ఉండాలని.. మందులు వాడాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. మద్రాస్ ఐని కళ్లకలక, పింక్ ఐ, రెడ్ ఐ పేరుతో పిలుస్తారు. కళ్లు ఎర్రబడటం, కంటి చుట్టూ నొప్పి, కళ్ల నుంచి నీరు కారడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఇది బ్యాక్టీరియా, వైరస్ వల్ల వస్తుంది. వ్యాధికి గురైనవారికి దగ్గరగా ఉన్నవారికి ఇది సోకే అవకాశం ఉంటుంది. ఇది అంటువ్యాధి. ఈ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ మొదటివారం వరకు ఈ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
అడినో వైరస్ కారణంగా ఈ మద్రాస్ ఐ ఇన్ఫెక్షన్ సోకుతుంది. 1918లో తొలిసారిగా మద్రాస్ లో దీన్ని గుర్తించడం వల్ల మద్రాస్ ఐ అనే పేరు వచ్చింది. ఎక్కువగా వేడి, తేమ ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. మద్రాస్ ప్రాంత, ముఖ్యంగా తమిళనాడులో ఈ తరహా వాతావరణం ఎక్కువగా ఉంటుంది.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..