Tamil Nadu Rains: వర్ష బీభత్సం.. వరదల్లో కొట్టుకుపోతున్న ఇళ్లు.. కుప్పుకూలుతున్న భవనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Rains: భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం మరోమారు అల్లాడిపోతోంది. దక్షిణ తమిళనాడులో కూరుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. తిరునెల్వెలి, టుటికోరిన్, టెంకాసి, కన్యాకుమారి జిల్లాల్లో కూరుస్తున్న కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్లు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇల్లు జలమయం కాగా.. మరికొన్ని చోట్ల నీట మునిగిపోయాయి.
Also Read: Barrelakka: నేను పవన్ ఫ్యాన్.. నాతో కంపేర్ చేయడం బాధగా ఉంది!
Also Read
- West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
పలు చోట్ల వరదల దాటికి చూస్తుండగానే భారీ భవంతిలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో ఇళ్లలో ప్రజలు ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది. కాగా వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాపనాశనం, పేరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలం.. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. ఈ వరదలకు లోతట్టు ప్రాంతాల్లో ని ఇళ్లు నీట మునిగాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అక్కడ సహాయక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంత ప్రజలకు సీఎం ఎంకే స్టాలిన్ అక్కడ సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరం అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను నిర్ధేశించారు.
అంతేకాదు దగ్గరుండి మరి ఆయన సహాయ చర్యలను పర్యవేక్షించారు. కాగా ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర పోలీస్ బలగాలు సహాయక చర్యలు చేపట్టారు. కాగా భారీ వర్షాల కారణంగా ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే, కొన్ని ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులకు సైతం సెలవు ప్రకటించారు. అంతకాదు తమిళనాడు వైపు వెళ్లే పలు రైళ్లు, విమానాలు కూడా రద్దయ్యాయి. ట్రాకులపై నీరు నిలిచిపోగా, తిరునల్వేలికి రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన వందేభారత్ సహా మొత్తం 17 రైళ్లను అధికారులు రద్దు చేశారు. అలాగే, తూత్తుకుడి నుంచి రాకపోకలు సాగించే కొన్ని విమానాలను దారి మళ్లీంచారు. మరికొన్నింటిని రద్దు చేశారు.
Also Read: Fire Accident: లక్నో ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
తాజావార్తలు
-
IND vs AFG: ముల్లన్పూర్లో భారత్ మర్చిపోలేని మ్యాజిక్.. ఆఫ్ఘన్పై 300 పరుగుల తేడాతో విజయం!
-
‘OG India Tour’: తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్లో లైవ్ కన్సర్ట్ షురూ!
-
Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
-
West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!