Tamil Nadu Rains: వర్ష బీభత్సం.. వరదల్లో కొట్టుకుపోతున్న ఇళ్లు.. కుప్పుకూలుతున్న భవనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Rains: భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం మరోమారు అల్లాడిపోతోంది. దక్షిణ తమిళనాడులో కూరుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. తిరునెల్వెలి, టుటికోరిన్, టెంకాసి, కన్యాకుమారి జిల్లాల్లో కూరుస్తున్న కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్లు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇల్లు జలమయం కాగా.. మరికొన్ని చోట్ల నీట మునిగిపోయాయి.
Also Read: Barrelakka: నేను పవన్ ఫ్యాన్.. నాతో కంపేర్ చేయడం బాధగా ఉంది!
Also Read
పలు చోట్ల వరదల దాటికి చూస్తుండగానే భారీ భవంతిలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో ఇళ్లలో ప్రజలు ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది. కాగా వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాపనాశనం, పేరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలం.. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. ఈ వరదలకు లోతట్టు ప్రాంతాల్లో ని ఇళ్లు నీట మునిగాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అక్కడ సహాయక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంత ప్రజలకు సీఎం ఎంకే స్టాలిన్ అక్కడ సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరం అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను నిర్ధేశించారు.
అంతేకాదు దగ్గరుండి మరి ఆయన సహాయ చర్యలను పర్యవేక్షించారు. కాగా ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర పోలీస్ బలగాలు సహాయక చర్యలు చేపట్టారు. కాగా భారీ వర్షాల కారణంగా ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే, కొన్ని ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులకు సైతం సెలవు ప్రకటించారు. అంతకాదు తమిళనాడు వైపు వెళ్లే పలు రైళ్లు, విమానాలు కూడా రద్దయ్యాయి. ట్రాకులపై నీరు నిలిచిపోగా, తిరునల్వేలికి రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన వందేభారత్ సహా మొత్తం 17 రైళ్లను అధికారులు రద్దు చేశారు. అలాగే, తూత్తుకుడి నుంచి రాకపోకలు సాగించే కొన్ని విమానాలను దారి మళ్లీంచారు. మరికొన్నింటిని రద్దు చేశారు.
Also Read: Fire Accident: లక్నో ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!