Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
- కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
- ప్రభుత్వ నిర్ణయంపై మద్రాస్ హైకోర్టులో సవాల్
- ఈనెల 10న పత్రాలు అందజేయనున్న సీఎం విజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ప్రభుత్వం కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్లో పిటిషన్ దాఖలైంది. ఈ నియామకాలను సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు తుది తీర్పు వచ్చే వరకు నిలిపివేయాలని పిటిషనర్ కోర్టును కోరారు.
మదురైకు చెందిన న్యాయవాది తీరన్ తిరుమురుగన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి, సిబ్బంది, పరిపాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి, కరూర్ జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన నేపథ్యంలో జూలై 10న ముఖ్యమంత్రి విజయ్ కరూర్ పర్యటన సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఆ నియామక ఉత్తర్వులను జారీ చేయకుండా.. అమలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
Also Read
- Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
- Jitendra Singh: అమిత్ షా కాల్పులకు ఆదేశాలు ఇవ్వరు, మెజిస్ట్రేట్ ఇస్తారు: కేంద్రం క్లారిటీ..
- Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
- Lok sabha: ఎయిరిండియా ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన
పిటిషనర్ వాదన ప్రకారం.. ఇలాంటి విషాద ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏకరీతి విధానం లేదన్నారు. ఒకే ఘటనకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు) ఉల్లంఘనకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది విలువైన రాజ్యాంగబద్ధమైన అవకాశం అని.. కేవలం కార్యనిర్వాహక నిర్ణయంతో దానిని అనుగ్రహంలా ఇవ్వకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజా సేవలో నియామకాలు సమానత్వం, పారదర్శకత, న్యాయబద్ధత, వివక్ష రహిత విధానాల ఆధారంగా జరగాలని వాదించారు.
ఏకరీతి విధానం లేదని అభ్యంతరం
ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పోటీ చేసే రాజ్యాంగ హక్కు ఉందని.. కానీ ఇలాంటి ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన విధానం లేదా చట్టపరమైన మార్గదర్శకాలను రూపొందించలేదని పిటిషనర్ తెలిపారు. అలాంటి మార్గదర్శకాలు లేకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఏకపక్షం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లోనే
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతోందని పిటిషనర్ గుర్తు చేశారు. కేసు తుది తీర్పు రాకముందే ప్రభుత్వ ఉద్యోగాల వంటి తిరిగి మార్చలేని పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చట్టపరమైన, పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాదించారు. అందువల్ల సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక ఉత్తర్వులు జారీ చేయకుండా.. అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని మద్రాస్ హైకోర్టును కోరారు.
తాజావార్తలు
-
Brahma Muhurat: “బ్రహ్మ ముహూర్తం”లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
-
Ajay Bhupathi: మహేష్ బాబు ఫ్యామిలీ హీరోతో సినిమా.. ఎందుకో చెప్పిన డైరెక్టర్ అజయ్ భూపతి!
-
Demonetisation Fraud Case: పాత నోట్ల మార్పిడి కేసులో సంచలన తీర్పు.!
-
Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
-
BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!