Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
- కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
- ప్రభుత్వ నిర్ణయంపై మద్రాస్ హైకోర్టులో సవాల్
- ఈనెల 10న పత్రాలు అందజేయనున్న సీఎం విజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ప్రభుత్వం కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్లో పిటిషన్ దాఖలైంది. ఈ నియామకాలను సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు తుది తీర్పు వచ్చే వరకు నిలిపివేయాలని పిటిషనర్ కోర్టును కోరారు.
మదురైకు చెందిన న్యాయవాది తీరన్ తిరుమురుగన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి, సిబ్బంది, పరిపాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి, కరూర్ జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన నేపథ్యంలో జూలై 10న ముఖ్యమంత్రి విజయ్ కరూర్ పర్యటన సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఆ నియామక ఉత్తర్వులను జారీ చేయకుండా.. అమలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
Also Read
- Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
- Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
- PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
- Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
పిటిషనర్ వాదన ప్రకారం.. ఇలాంటి విషాద ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏకరీతి విధానం లేదన్నారు. ఒకే ఘటనకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు) ఉల్లంఘనకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది విలువైన రాజ్యాంగబద్ధమైన అవకాశం అని.. కేవలం కార్యనిర్వాహక నిర్ణయంతో దానిని అనుగ్రహంలా ఇవ్వకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజా సేవలో నియామకాలు సమానత్వం, పారదర్శకత, న్యాయబద్ధత, వివక్ష రహిత విధానాల ఆధారంగా జరగాలని వాదించారు.
ఏకరీతి విధానం లేదని అభ్యంతరం
ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పోటీ చేసే రాజ్యాంగ హక్కు ఉందని.. కానీ ఇలాంటి ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన విధానం లేదా చట్టపరమైన మార్గదర్శకాలను రూపొందించలేదని పిటిషనర్ తెలిపారు. అలాంటి మార్గదర్శకాలు లేకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఏకపక్షం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లోనే
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతోందని పిటిషనర్ గుర్తు చేశారు. కేసు తుది తీర్పు రాకముందే ప్రభుత్వ ఉద్యోగాల వంటి తిరిగి మార్చలేని పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చట్టపరమైన, పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాదించారు. అందువల్ల సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక ఉత్తర్వులు జారీ చేయకుండా.. అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని మద్రాస్ హైకోర్టును కోరారు.
తాజావార్తలు
-
Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
-
AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
-
Nepal: 25 మందిని చంపిన ‘‘కిల్లర్ ఏనుగు’’.. ఒకే కుటుంబంపై రెండుసార్లు దాడి..
-
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
-
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్కు గుడ్ న్యూస్..?
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..