CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో సమావేశం
- రేపు ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్
- ప్రధాని మోడీతో సమావేశం
- కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం హస్తినకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో భేటీ తర్వాత వివిధ కేంద్రమంత్రులను కూడా కలవొచ్చని సమాచారం. ఇక మోడీతో సమావేశంలో పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా కర్ణాటకతో ఉన్న మేకధాతు డ్యాం వివాదాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ వివాదంపై ఇప్పటికే ప్రధానికి సీఎం విజయ్ లేఖ రాశారు. కావేరి నదిపై మేకధాతు డ్యాం నిర్మించాలని కర్ణాటక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం తమిళనాడు-కర్ణాటక మధ్య మేకధాతు డ్యాం. వివాదం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ఛాన్సుంది.
అలాగే శ్రీలంక జలాల సమీపంలో తమిళనాడు మత్స్యకారులపై జరుగుతున్న దాడులు, నిర్బంధాలు, కీలక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర సహాయాన్ని విజయ్ కోరనున్నట్లు సమాచారం. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను కలిసి.. భారత్-శ్రీలంకల మధ్య దీర్ఘకాలంగా దౌత్య, రాజకీయ సమస్యగా ఉన్న మత్స్యకారుల సమస్యను ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా రామనాథపురం, నాగపట్టణం వంటి తీరప్రాంత జిల్లాల మత్స్యకారులు తరచుగా పాల్క్ జలసంధి సమీపంలోని జలాల్లోకి వెళ్తుంటారు. అక్కడ సముద్ర సరిహద్దుల వివాదాల కారణంగా గత కొన్నేళ్లుగా శ్రీలంక అధికారులు మత్స్యకారులను అరెస్టు చేయడం, నిర్బంధించడం, పడవలను స్వాధీనం చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ సమస్య తమిళనాడులో పదేపదే నిరసనలకు దారితీసింది. నిర్బంధంలో ఉన్న మత్స్యకారులను విడుదల చేయించాలని, శాశ్వత దౌత్య పరిష్కారం కనుగొనాలని వరుస రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత్-శ్రీలంక చర్చలు జరిపినప్పటికీ, ఎప్పటికప్పుడు సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ అంశాన్ని ప్రధానంగా విజయ్ లేవనెత్తనున్నారు.
Also Read
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
- Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి అధిక సహాయం కోరుతూ విజయ్ ప్రతిపాదనలు సమర్పించే అవకాశం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలు, విపత్తు సహాయం, పారిశ్రామిక వృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి కేటాయింపులు పెంచాలని తమిళనాడు తరచుగా కోరుతూ వస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర పెద్దలతో విజయ్ కలవనున్న నేపథ్యంలో పర్యటన ఆసక్తి రేపుతోంది.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు.. “జిహాద్, ప్రతిఘటనే ఏకైక మార్గం”.. మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
-
The Paradise: 20 కోట్ల వ్యూస్తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్పై బిగ్ అప్డేట్!
-
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ
-
Ram Charan: రామ్ చరణ్కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!