CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay Anti Corruption Drive: తమిళనాడులో తనదైన మార్క్ పాలన అందించే దిశగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి విజయ్.. అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న మొత్తంలో అయినా లంచం డిమాండ్ చేసిన అధికారులపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వారికి రూ.1 లక్ష వరకు బహుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి అధికారులపై నేరుగా ప్రజల నుంచే సమాచారం సేకరించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్లైన్, ఆన్లైన్ పోర్టల్, ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక, ఫిర్యాదు చేసే వ్యక్తుల వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.
అవినీతి నిరోధక శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం విజయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. శాఖలో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతి వ్యవహారాలపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు మూడు నెలల గడువు విధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టే అవకాశం ఉందని సమాచారం. టెండర్లు, కాంట్రాక్టులు, ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం విజయ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. “ప్రజల డబ్బు పవిత్రమైనది.. అవినీతి చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం” అంటూ అధికారులకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.
Also Read
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
‘క్లీన్ గవర్నెన్స్’నే తన ప్రభుత్వ ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం విజయ్ తాజా నిర్ణయాలు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. అవినీతి నిర్మూలనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇక, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్.. అన్ని వర్గాలను కలుస్తున్నారు.. రాజకీయ నేతలు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజలు ఇలా అందరినీ కలుస్తూ.. వారి సలహాలు తీసుకుంటున్నారు.. తాజాగా, ప్రభుత్వ అంబులెన్స్ను ప్రారంభించే ముందు.. ఆయనే ప్రత్యేకంగా దానిని పరిశీలించారు..
తాజావార్తలు
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!