Tamil Nadu: బీజేపీలో శరత్ కుమార్ పార్టీ విలీనం.. అన్నామలై సమక్షంలో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: లోక్సభ ఎన్నికల ముందు తమిళనాడులో కీలక పరిణామం జరిగింది. ప్రముఖ తమిళనటుడు శరత్ కుమార్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసింది. అఖిల ఇండియా సమతువ మక్కల్ కట్చీ(AISMK)ని బిజెపిలో విలీనం చేశారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై సమక్షంలో శరత్ కుమార్, ఆయన పార్టీ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశఐక్యతను పెంపొందించంతో పాటు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు మోడీకి సహకరిస్తానని శరత్ కుమార్ అన్నారు.
Read Also: Kidney Fraud: కిడ్నీకి రూ.2 కోట్లు వస్తాయని తెలిసి ఆ చార్టర్డ్ అకౌంటెంట్.. చివరకు..?!
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
2026లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని శరత్ కుమార్ తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శరత్ కుమార్ చేరితో బీజేపీ మరింత బలపడుతుందని అన్నామలై అన్నారు. బీజేపీ కుటుంబం మరింత విస్తరించిందని అన్నారు. తమిళనాడు నుంచి ఎక్కువ మంది ఎంపీలకు పార్లమెంట్కి పంపాలన్న పార్టీ నిబద్ధతను ఈ విలీన కార్యక్రమం బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. డీఎంకే పార్టీలో మొదట చేరిన శరత్ కుమార్ని ఆ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది, డీఎంకే నుంచి బయటకు వచ్చి ఏఐడీఎంకేలో చేరారు. ఆ తర్వాత 2007లో ఎఐఎస్ఎంకే పార్టీని స్థాపించారు. ప్రస్తుతం దీన్ని బీజేపీలో విలీనం చేశారు.
மாண்புமிகு பாரதப் பிரதமர் திரு @narendramodi அவர்களின் தலைமைத்துவதால் ஈர்க்கப்பட்ட சிறந்த தேசியவாதியான திரு @realsarathkumar அவர்கள், இன்று, @BJP4Tamilnadu மூத்த தலைவர்கள் & பாராளுமன்ற தேர்தல் பொறுப்பாளர் திரு @MenonArvindBJP அவர்கள் முன்னிலையில் அனைத்திந்திய சமத்துவ மக்கள்… pic.twitter.com/bQ3dKQ5puj
— K.Annamalai (@annamalai_k) March 12, 2024
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!