Operation Sindoor: సర్జికల్ స్ట్రైక్స్ + బాలాకోట్ స్ట్రైక్స్ = ఆపరేషన్ సిందూర్..
- సర్జికల్ స్ట్రైక్స్ , బాలాకోట్ స్ట్రైక్ కలిపితే ఆపరేషన్ సిందూర్..
- పీఓకేతో పాటు పంజాబ్ ప్రావిన్సుల్లోకి దూరి ఆపరేషన్..
- వందలాది మంది ఉగ్రవాదుల్ని ఖతం చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్, దాని పెంపుడు ఉగ్రవాదుల్ని భారత్ హడలెత్తించింది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తోయిబాతో పాటు జైషే మహ్మద్ ఉగ్రవాదుల్ని వెతికి వేటాడి చంపేసింది. అత్యంత ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో పాకిస్తాన్పై భారత్ క్షిపణి దాడులు చేసింది. ముఖ్యంగా పీఓకేతో పాటు పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లోని 09 ఉగ్రస్థావరాలపై 24 దాడుల్ని చేసింది. ఈ దాడుల్లో మొత్తం 80 నుంచి 100 వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఉగ్రవాదానికి పాల్పడితే మీ దేశంలో ఎక్కడికైనా వచ్చి ఉగ్రవాదుల్ని తుదముట్టిస్తామని పాకిస్తాన్కి భారత్ గట్టి హెచ్చరికలు పంపింది.
పీఓకేలో “సర్జికల్ స్ట్రైక్స్”:
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇదిలా ఉంటే, పాకిస్తాన్కి మరోసారి భారత్ గత దాడుల్ని గుర్తు చేసింది. అంతకన్నా తీవ్రమైన దాడులు చేస్తూ దాయాదిని భయపెట్టింది. 2016లో జరిగిన ఉరి ఉగ్రదాడిలో 20 మంది సైనికులు చనిపోగా, 21 మంది గాయపడ్డారు. దీని తర్వాత భారత్ తన పారామిలిటరీతో పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్ చేయించింది. టెర్రర్ లాంచ్ ప్యాడ్స్, ట్రైనింగ్ సెంటర్లను నాశనం చేస్తూ ఉగ్రవాదుల్ని హతమార్చింది.
పాకిస్తాన్లో ‘‘బాలాకోట్ స్ట్రైక్స్’’:
ఆ తర్వాత 2019లో పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు చనిపోయారు. దీనికి బదులుగా పాక్ ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని బాలాకోట్పై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. పీఓకే కాకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి, పాక్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి భారత్ దాడులు జరిపింది. ఈ దాడుల్ని భారత వైమానికదళం నిర్వహించింది. అయితే, ఈ రెండు దాడులు జరగలేదని పాక్ బుకాయిస్తూ వచ్చింది.
సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ కలిపితే ఆపరేషన్ సిందూర్:
అయితే, ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ అంతకుమించి పాకిస్తాన్ని వణికించింది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ మూడు కలిసి ఈ ఆపరేషన్ని పూర్తి చేశాయి. గతంలో కన్నా భిన్నంగా తమపై భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ఒప్పుకుంది. సర్జికల్ స్ట్రైక్స్ ప్లస్ బాలాకోట్ స్ట్రైక్స్ కలిస్తే ‘‘ఆపరేషన్ సిందూర్’’గా చెప్పవచ్చు. ఈ ఆపరేషన్లో భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)తో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని మురిడ్కే, సియాల్ కోట్, బహవల్పూర్ ఉగ్రస్థావరాలపై భీకర దాడులు చేసింది. స్కాల్ప్, హామర్ వంటి అత్యాధునిక క్షిపణుల్ని ఉపయోగించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించారు.
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!