Supreme Court: ఈడీని సమర్థిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court key judgment on Anti-Money Laundering Cases: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు మద్దతు ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పును బుధవారం వెలువరించింది. ఈడీ అరెస్ట్ చేసే అధికారంలో పాటు ఈడీకి వ్యతిరేకంగా లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం( పీఎంఎల్ఏ)లోని నేర పరిశోధన, అరెస్ట్ అధికారం, ఆస్తుల అటాచ్మెంట్ మొదలైన నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. మనీలాండరింగ్ అరెస్టులు ‘‘ఏకపక్షం’’ కానది సంచలన ఉత్తర్వుల ఇచ్చింది.
అరెస్టుకు గల కారణాలను, సాక్షాధారాలను తమకు తెలియకుండా నిందితులను అరెస్ట్ చేసే అధికారం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల వాదించారు. విచారణ సమయంలో నిందితుడి నుంచి ఈడీ దోహపూరిత వాంగ్మూలాన్ని నమోదు చేయడం కూడా చట్టవ్యతిరేకం అని పిటిషనర్ల తరుపున వాదనలు వినిపించారు. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్)ని ఎఫ్ఐఆర్తో పోల్చలేమని.. ఇసిఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంతర్గత పత్రమని సుప్రీంకోర్టు పేర్కొంది. నిందితులకు ఇసిఐఆర్ ఇవ్వడం తప్పనిసరి కాదని.. అరెస్టు సమయంలో కారణాలను మాత్రమే బహిర్గతం చేస్తే సరిపోతుందని సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
కేంద్రం తరుపున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహాతా మనీలాండరింగ్ నేరాల తీవ్రతను సుప్రీంకోర్టుకు తెలిపారు. మనీలాండరింగ్ నిరంతర నేరమని ఆయన కోర్టుకు వివరించారు. ఇటీవల మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)లో కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ కార్తీ చిదంబరం, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు మరికొంత మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు సుప్రీంకోర్టు ఈడీకి అనుకూలంగా కీలక తీర్పును వెల్లడించింది. మనీలాండరింగ్ కేవలం విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి అవినీతి వ్యాపారుల ద్వారానే కాకుండా ఉగ్రవాద గ్రూపుల ద్వారా కూడా నిర్వహించబడుతోందని.. మనీలాండరింగ్ దేశ సమగ్రతకే కాకుండా సార్వభౌమాత్వానికి ముప్పు కలిగిస్తుందని పీఎంఎల్ఏ నిబంధనలను సమర్థించింది.
తాజావార్తలు
-
Yash Toxic: యష్కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?