Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Supreme Court Sets Up Task Force To Look Into Doctors Safety At Workplace

Supreme Court: ఆస్పత్రులు, డాక్టర్ల భద్రతపై నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు..

Published Date :August 20, 2024 , 12:41 pm
By Venu Goapl Reddy
  • సుప్రీంకోర్టులో కోల్‌కతా వైద్యురాలి ఘటన విచారణ..
  • డాక్టర్లు భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..
  • 10 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్..
Supreme Court: ఆస్పత్రులు, డాక్టర్ల భద్రతపై నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Supreme Court: కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేస్తోంది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, ఈ రోజు విచారించింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం, బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం, పోలీసుల అలసత్వంపై విరుచుకుపడింది. ఇదిలా ఉంటే డాక్టర్లు, ఆస్పత్రుల భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను, రెండు నెలల్లో తుది నివేదికను సమర్పించాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టిఎఫ్)ని ఆదేశించినట్లు కోర్టు పేర్కొంది.

Read Also: PM Modi: రాష్ట్రపతి భవన్‌లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు ప్రధాని మోదీ స్వాగతం..

Also Read

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
  • TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
  • West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
Add as a preferred
source on google

టాస్క్‌ఫోర్స్‌లో వివిధ విభాగాలకు వైద్యులను కలిగి ఉంటారని, వారు “భద్రతను నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన విధానాలను మాకు తెలియజేస్తారని” ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల భద్రత, రక్షణను నిర్ధారించడానికి మేము ఇక్కడ ఉన్నామని చంద్రచూడ్ అన్నారు. ఇది అత్యున్నత జాతీయ ఆందోళనగా అభివర్ణించారు. దేశం మరో అత్యాచారం, హత్య కోసం వేచి ఉండదని ఆయన అన్నారు. న్యాయమూర్తులు జెబి పార్దివాలా మరియు మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది.

10 మందితో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్‌కు నావికాదళానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ నాయకత్వం వహిస్తారు. ఆమెతో పాటు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి మరియు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ కూడా ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌లో నిమ్మాన్స్ బెంగళూర్ నుంచి డాక్టర్ ప్రతిమా మూర్తి, ఎయిమ్స్ జోధ్ పూర్ నుంచి డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి, ఢిల్లీ గంగారామ్ హాస్పిటన్ నుంచి డాక్టర్ సోమిక్రా రావత్ , ప్రముఖ మెడికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనితా సక్సేనా, జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ పల్లవి సావ్లే, గుర్గావ్ లోని పారిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పద్మ శ్రీ వాస్తవ సభ్యులుగా ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kolkata Doctor case
  • National task force of doctors
  • Supreme Court

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions