Supreme Court: ఆస్పత్రులు, డాక్టర్ల భద్రతపై నేషనల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు..
- సుప్రీంకోర్టులో కోల్కతా వైద్యురాలి ఘటన విచారణ..
- డాక్టర్లు భద్రత కోసం జాతీయ టాస్క్ఫోర్స్ ఏర్పాటు..
- 10 మంది సభ్యులతో టాస్క్ఫోర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని షాక్కి గురిచేస్తోంది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, ఈ రోజు విచారించింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం, బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం, పోలీసుల అలసత్వంపై విరుచుకుపడింది. ఇదిలా ఉంటే డాక్టర్లు, ఆస్పత్రుల భద్రత కోసం జాతీయ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను, రెండు నెలల్లో తుది నివేదికను సమర్పించాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్టిఎఫ్)ని ఆదేశించినట్లు కోర్టు పేర్కొంది.
Read Also: PM Modi: రాష్ట్రపతి భవన్లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు ప్రధాని మోదీ స్వాగతం..
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
టాస్క్ఫోర్స్లో వివిధ విభాగాలకు వైద్యులను కలిగి ఉంటారని, వారు “భద్రతను నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన విధానాలను మాకు తెలియజేస్తారని” ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల భద్రత, రక్షణను నిర్ధారించడానికి మేము ఇక్కడ ఉన్నామని చంద్రచూడ్ అన్నారు. ఇది అత్యున్నత జాతీయ ఆందోళనగా అభివర్ణించారు. దేశం మరో అత్యాచారం, హత్య కోసం వేచి ఉండదని ఆయన అన్నారు. న్యాయమూర్తులు జెబి పార్దివాలా మరియు మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది.
10 మందితో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్కు నావికాదళానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ నాయకత్వం వహిస్తారు. ఆమెతో పాటు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి మరియు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ కూడా ఉన్నారు. టాస్క్ఫోర్స్లో నిమ్మాన్స్ బెంగళూర్ నుంచి డాక్టర్ ప్రతిమా మూర్తి, ఎయిమ్స్ జోధ్ పూర్ నుంచి డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి, ఢిల్లీ గంగారామ్ హాస్పిటన్ నుంచి డాక్టర్ సోమిక్రా రావత్ , ప్రముఖ మెడికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనితా సక్సేనా, జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ పల్లవి సావ్లే, గుర్గావ్ లోని పారిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పద్మ శ్రీ వాస్తవ సభ్యులుగా ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!