Google: సుప్రీంకోర్టులో గూగుల్కు చుక్కెదురు.. రూ.1337 కోట్ల పెనాల్టీ కట్టాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Rejects Google’s Request Against ₹ 1,337 Crore Penalty: అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ కు సుప్రీంకోర్టులో గురువారం చుక్కెదురు అయింది. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తీర్పును సవాల్ చేస్తూ గూగుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్టే ఇవ్వాలని సుప్రీంను కోరింది. అయితే ఈ కేసుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. నిబంధనలను అతిక్రమించి గుత్తాధితప్యంగా వ్యవహరిస్తోందని గూగుల్ పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ.1337 కోట్ల జరిమానా విధించింది. దీనిపై గూగుల్ సుప్రీంను ఆశ్రయించింది.
Read Also: Manchu Manoj: మరోసారి మంచు వారింట పెళ్లి భాజాలు.. మోహన్ బాబుకు ఇష్టమేనా..?
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
తాజాగా మొత్తం పెనాల్టీలో కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వద్ద 10 శాతం పెనాల్టీని ఏడురోజుల్లో డిపాజిట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది. కేసు విచారణ కోసం గురువారం నుంచి మూడు రోజుల్లోగా (ఎన్సీఎల్ఏటీ) సంప్రదించాలని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31లోగా గూగుల్ ఆప్పీల్ పై నిర్ణయం తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ను సుప్రీంకోర్టు కోరింది.
దేశంలో ఆండ్రాయిడ్ గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తుందని గూగుల్ పై సీసీఐ జరిమానా విధించింది. దేశంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందని గూగుల్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ లో గూగుల్ ఆండ్రాయిడ్ ది 97 శాతం. అయితే నిబంధనలకు, భారతీయ చట్టాలకు విరుద్ధంగా తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందని ప్రధాన ఆరోపణ. గూగుల్ సంస్థ యూరప్ దేశాల్లో ఒకలా భారత్ తో మరోలా వ్యవహరిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీసీఐ తరుపున సోలిసిటర్ జనరల్ వెంకట్ రామనన్ వాదనలు వినిపించారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!