Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
- సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట
- బెయిల్ రద్దుకు నిరాకరణ
- తదుపరి విచారణపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మేఘాలయ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను వెంటనే రద్దు చేయాలని మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ప్రస్తుతం బెయిల్పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే, ఈ అంశంపై సోనమ్కు నోటీసు జారీ చేసి, వచ్చే వారం గురువారం తదుపరి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
బెయిల్పై స్టే విధించేందుకు సుముఖంగా లేమన్న సుప్రీంకోర్టు
జస్టిస్లు ఎం.ఎం. సుందరేశ్, షీల్ నాగుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా సోనమ్ ఇప్పటికే బెయిల్పై విడుదలైందని, ప్రస్తుత దశలో ఆమె బెయిల్ను నిలిపివేయడానికి తాము సుముఖంగా లేమని ధర్మాసనం పేర్కొంది. అయితే, మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సోనమ్ రఘువంశీకి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి విచారణ అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
మేఘాలయ ప్రభుత్వ వాదన
విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మేఘాలయ ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించారు. ఇది అత్యంత సంచలనాత్మకమైన, పథకం ప్రకారం జరిగిన హత్య కేసు అని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే అనుబంధ ఛార్జిషీట్ దాఖలైనప్పటికీ, గతంలో మూడు సార్లు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన అదే న్యాయమూర్తి నాలుగోసారి బెయిల్ మంజూరు చేయడం సరైన నిర్ణయం కాదని ఆయన వాదించారు.
“ఇది ముందే పథకం వేసిన హత్య”
తుషార్ మెహతా వాదనల్లో, రాజా రఘువంశీ హత్య పూర్తిగా పథకం ప్రకారం జరిగిందని పేర్కొన్నారు. ఆయన ప్రకారం, హనీమూన్ పేరుతో రాజాను మేఘాలయకు తీసుకెళ్లిన సోనమ్, తనతో పాటు మరికొందరితో కలిసి హత్యకు కుట్ర పన్నింది. రాజాను హత్య చేసిన అనంతరం అతని మృతదేహాన్ని లోయలో పడేసి, అనంతరం పరారైందని తెలిపారు. తర్వాత ఆమెను ఉత్తరప్రదేశ్లో పోలీసులు అరెస్టు చేసినట్లు కోర్టుకు వివరించారు.
రాజా రఘువంశీ హత్య కేసు ఏమిటి?
ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ 2025 మే నెలలో సోనమ్ రఘువంశీని వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఇద్దరూ హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్కు వెళ్లారు. అక్కడ రాజా అదృశ్యమవ్వగా, కొన్ని రోజుల తర్వాత అతని మృతదేహం లోయలో లభ్యమైంది. దర్యాప్తులో సోనమ్కు రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
హనీమూన్ను సాకుగా ఉపయోగించి రాజా రఘువంశీ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సోనమ్ రఘువంశీతో పాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
తదుపరి విచారణపై ఉత్కంఠ
సుప్రీంకోర్టు ప్రస్తుతం సోనమ్ రఘువంశీ బెయిల్ను రద్దు చేయడానికి నిరాకరించినప్పటికీ, మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై పూర్తి స్థాయి విచారణ కొనసాగనుంది. వచ్చే వారం జరిగే విచారణలో ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!