Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- న్యాయవ్యవస్థలో అవినీతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్
- విద్యావేత్తలపై విధించిన నిషేధం ఎత్తివేత
- ధర్మాసనం నిర్ణయంపై విస్మయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మధ్య కాలంలో ఎన్సీఈఆర్టీ (NCERT) 8వ తరగతి పాఠ్యపుస్తకంగా ‘‘న్యాయవ్యవస్థలో అవినీతి’’ అనే పాఠంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చాలా సీరియస్ అయింది. గత ఫిబ్రవరిలో చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే న్యాయవ్యవస్థను గురించి విద్యార్థులకు తప్పుడు సందేశాన్ని పంపిస్తున్నారని ఫైర్ అయింది. దీంతో ఎన్సీఈఆర్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పింది. అభ్యంతరకర పాఠ్యాంశాలను వెబ్సైట్ నుంచి తొలగించి.. పుస్తకాల పంపిణీని నిలిపివేసింది.
తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ముగ్గురు విద్యావేత్తలపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంది. అలాగే వారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరించారన్న వ్యాఖ్యలను కూడా న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రొఫెసర్ మైఖేల్ డానినో, సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్లపై మార్చి 11న జారీ చేసిన ఆదేశాలను సవరించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ఈ ముగ్గురు విద్యావేత్తలను అకడమిక్ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచాలని ఇచ్చిన ఆదేశాన్ని తాజాగా రద్దు చేసింది.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
“దరఖాస్తుదారులు ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత.. గత ఆదేశంలోని 8వ పేరాలో ఉన్న సూచనలను సవరించడం సముచితమని భావిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఇతర సంస్థలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు” అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. అలాగే ఈ ముగ్గురు విద్యావేత్తలు కావాలనే వాస్తవాలను తప్పుగా చూపించారన్న వ్యాఖ్యలను కూడా ధర్మాసనం వెనక్కి తీసుకుంది. వారు ఇచ్చిన వివరణల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 2026లో “మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర” అనే అధ్యాయంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఉన్న కొన్ని అంశాలు వివాదానికి దారితీశాయి. మీడియా కథనాల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. అనంతరం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) ఆ భాగాన్ని “అనుకోకుండా జరిగిన పొరపాటు”గా పేర్కొంటూ పుస్తకం నుంచి తొలగించింది. ఈ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఆ పుస్తకం ముద్రణ, పంపిణీపై తాత్కాలిక నిషేధం విధించింది. అలాగే పాఠ్యపుస్తకాల తయారీ, సిలబస్ రూపకల్పనలో ఈ ముగ్గురు నిపుణులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోసారి న్యాయస్థానం నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!