Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- న్యాయవ్యవస్థలో అవినీతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్
- విద్యావేత్తలపై విధించిన నిషేధం ఎత్తివేత
- ధర్మాసనం నిర్ణయంపై విస్మయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మధ్య కాలంలో ఎన్సీఈఆర్టీ (NCERT) 8వ తరగతి పాఠ్యపుస్తకంగా ‘‘న్యాయవ్యవస్థలో అవినీతి’’ అనే పాఠంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చాలా సీరియస్ అయింది. గత ఫిబ్రవరిలో చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే న్యాయవ్యవస్థను గురించి విద్యార్థులకు తప్పుడు సందేశాన్ని పంపిస్తున్నారని ఫైర్ అయింది. దీంతో ఎన్సీఈఆర్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పింది. అభ్యంతరకర పాఠ్యాంశాలను వెబ్సైట్ నుంచి తొలగించి.. పుస్తకాల పంపిణీని నిలిపివేసింది.
తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ముగ్గురు విద్యావేత్తలపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంది. అలాగే వారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరించారన్న వ్యాఖ్యలను కూడా న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రొఫెసర్ మైఖేల్ డానినో, సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్లపై మార్చి 11న జారీ చేసిన ఆదేశాలను సవరించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ఈ ముగ్గురు విద్యావేత్తలను అకడమిక్ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచాలని ఇచ్చిన ఆదేశాన్ని తాజాగా రద్దు చేసింది.
Also Read
- Meenakshi Natarajan: "మేము జోక్యం చేసుకోలేం".. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
- Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
“దరఖాస్తుదారులు ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత.. గత ఆదేశంలోని 8వ పేరాలో ఉన్న సూచనలను సవరించడం సముచితమని భావిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఇతర సంస్థలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు” అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. అలాగే ఈ ముగ్గురు విద్యావేత్తలు కావాలనే వాస్తవాలను తప్పుగా చూపించారన్న వ్యాఖ్యలను కూడా ధర్మాసనం వెనక్కి తీసుకుంది. వారు ఇచ్చిన వివరణల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 2026లో “మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర” అనే అధ్యాయంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఉన్న కొన్ని అంశాలు వివాదానికి దారితీశాయి. మీడియా కథనాల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. అనంతరం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) ఆ భాగాన్ని “అనుకోకుండా జరిగిన పొరపాటు”గా పేర్కొంటూ పుస్తకం నుంచి తొలగించింది. ఈ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఆ పుస్తకం ముద్రణ, పంపిణీపై తాత్కాలిక నిషేధం విధించింది. అలాగే పాఠ్యపుస్తకాల తయారీ, సిలబస్ రూపకల్పనలో ఈ ముగ్గురు నిపుణులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోసారి న్యాయస్థానం నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Google Maps: గూగుల్ మ్యాప్స్లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
-
Pawan Kalyan: 21 సీట్లతో రాజీపడలేదు.. ఏపీ కోసం మేం త్యాగం చేశాం!
-
China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!