Supreme Court: ‘మియాన్ ముస్లిం’ వంటి రెచ్చగొట్టే ప్రకటనలను నిషేధించాలి.. యోగి సహా బీజేపీ సీఎంలపై సుప్రీంకోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: మియా ముస్లిం’, ‘కథా ముల్లా’, ‘వరద జిహాద్’ వంటి రెచ్చగొట్టే, విభజనాత్మక పదాలను బహిరంగ వేదికలపై ఉపయోగించడాన్ని నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సహా పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, నేతల వ్యాఖ్యలపై ఈ పిటిషన్ దాఖలైంది.
Read Also: NTR – Prashanth Neel’s : రూటు మార్చిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ కోసం స్పెషల్ మేకోవర్
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇలాంటి పదాలను ఉపయోగించడం రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న వ్యక్తుల బాధ్యతలకు విరుద్ధమని, ఇది సమాజంలో విభజన, భయం, ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించారు. ముఖ్యంగా మతపరమైన సమూహాలను లక్ష్యంగా చేసుకుని చేసే వ్యాఖ్యలు సామాజిక సమరసతకు ముప్పుగా మారుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన ‘మియా ముస్లిం’, ‘వరద జిహాద్’ వ్యాఖ్యలు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉపయోగించిన ‘కథా ముల్లా’ పదం, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, బీజేపీ నేత నితేష్ రాణే ముస్లింలను “పాకిస్తానీ పింప్స్”గా సంబోధించిన వ్యాఖ్యలను పిటిషనర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ పిటిషన్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన ఒక వ్యాఖ్యను కూడా ప్రస్తావించారు. చరిత్రపై ప్రతీకారం తీర్చుకునేలా యువతను ప్రేరేపించే వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని పెంచుతాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, సామాజిక కార్యకర్తలు జాన్ దయాల్, రూప్ రేఖ వర్మ సహా మొత్తం 12 మంది సామాజిక కార్యకర్తలు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు విభజనాత్మక వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని వారు సుప్రీంకోర్టును కోరారు. అలాగే, ఓటరు జాబితాల నుంచి మతపరమైన సమాజాలకు చెందిన వారిని తొలగించాలనే డిమాండ్లు రాజ్యాంగ విరుద్ధమని కూడా పిటిషన్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!