Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- చిన్నారుల మిస్సింగ్లపై సుప్రీంకోర్టు సీరియస్
- ఇక కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే
- అన్ని పోలీస్ స్టేషన్లకు సుప్రీంకోర్టు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పిల్లల మిస్సింగ్ కేసులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఇకపై పిల్లల మిస్సింగ్పై కిడ్నాప్ ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో 2011 నుంచి కనిపించకుండా పోయిన ఒక చిన్నారి కేసును విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ఎవరైనా వ్యక్తి లేదా చిన్నారి కనిపించకుండా పోయిన ప్రతి కేసులో కిడ్నాప్ కేసు నమోదు చేయడం అన్ని పోలీస్ స్టేషన్లకు తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల అక్రమ రవాణా, ఏళ్ల తరబడి ఆచూకీ లభించని పిల్లల సమస్యను అత్యంత గంభీరంగా పరిగణిస్తూ పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని న్యాయస్థానం పేర్కొంది.
Also Read
- Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
- Jaishankar: యూరప్ అహంకారంపై భారత్ దెబ్బ.. జైశంకర్ సమాధానంతో సైలెంట్..
- Congress: "అఖండ కాంగ్రెస్".. విలీనం దిశగా టీఎంసీ, ఎన్సీపీ..
- Charu Pandey: కోచింగ్ లేదు.. బుక్స్ పట్టుకుని కూర్చోలేదు! కానీ 19 గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు!
దేశంలో సుమారు 47 వేల మంది పిల్లలు ఇప్పటికీ ఆచూకీ లేకుండా ఉన్నారనే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ‘‘ఏ వ్యక్తి లేదా చిన్నారి కనిపించకుండా పోయిన సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయకూడదు. బాధిత కుటుంబ సభ్యులపై వెతికే బాధ్యతను మోపకూడదు.’’ అని స్పష్టం చేసింది.
అంతేకాకుండా నమోదయ్యే ఎఫ్ఐఆర్లో భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కిడ్నాప్కు సంబంధించిన సెక్షన్లు తప్పనిసరిగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు అహ్సానుద్దీన్ అమానుల్లా, ఆర్. మహాదేవన్ల ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది ఎంతో పెద్ద సమస్య. కానీ దీని తీవ్రతను ఎవరూ గుర్తించడం లేదు. ప్రజలు ఈ విషయంలో దిగ్భ్రాంతి చెందాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాన్ని చూసీ చూడనట్టుగా ఎలా ఉండగలం?.’’ అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్కు స్టార్ ప్లేయర్ గుడ్బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్కు ముగింపు
-
Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
-
Peddi Team: కోడి రామ్మూర్తి నాయుడు వారసుడి ఇంటికి ‘పెద్ది’ టీమ్
-
Jaishankar: యూరప్ అహంకారంపై భారత్ దెబ్బ.. జైశంకర్ సమాధానంతో సైలెంట్..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!