NTV Telugu Site icon

Supreme court: ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌.. ఎన్నికల సంఘానికి నోటీసులు

Supreme

Supreme

Supreme court: ఎన్నికల టైంలో పొలిటికల్ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఓ లాయర్ సుప్రీంలో పిల్ ఫైల్ చేశారు. పొలిటికల్ పార్టీలు ఎన్నికల ముందు ఉచిత వాగ్దానాలు చేయకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకునేలా పోల్‌ ప్యానెల్‌ను ఆదేశించాలని ఆ పిటిషన్ లో వెల్లడించారు.

Read Also: Bigg Boss 8: తారస్థాయికి చేరిన నామినేషన్ రచ్చ.. మరి ఈ వారం నామినేషన్ లోకి ఎవరొచ్చారంటే?

ఇక, ఈ ఉచిత హామీల వల్ల ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతుందని బెంగళూరుకు చెందిన లాయర్ వేసిన పిటిషన్ లో వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇదే అంశంపై పెడింగ్‌లో ఉన్న పలు కేసులతో కలిపి దీన్ని విచారించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కేంద్రానికి, ఈసీకి నోటీసులు ఇచ్చింది. కాగా, పిటిషనర్‌ తరఫు న్యాయవాది విజయ్‌ హన్సారియా ఉచిత హామీల అంశంపై అత్యవసర విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు. అదే విధంగా ఎన్నికల ముందు ఇచ్చే ఉచిత వాగ్దానాలు ఓటర్లపై తీవ్ర ప్రభావితం చూపించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీస్తున్నాయని కోర్టులో న్యాయవాది పేర్కొన్నారు.