Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు
- ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పాదచారుల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రోడ్ల పక్కన సక్రమంగా గుర్తించిన, నిర్వహించిన ఫుట్పాత్లపై నడిచే హక్కు భారత పౌరుల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. అంతేకాకుండా మోటారు వాహనాల రాకపోకల కంటే పాదచారుల హక్కుకే ప్రాధాన్యం ఉండాలని పేర్కొంది. ఈ హక్కును రక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. “ఒక రహదారి ఉంటే దాని వెంట ఫుట్పాత్ను ఏర్పాటు చేసి నిర్వహించడం ప్రభుత్వాల బాధ్యత. ఇది కేవలం పరిపాలనా బాధ్యత మాత్రమే కాదు. అమలు చేయదగిన చట్టబద్ధ బాధ్యత కూడా. ఫుట్పాత్పై నడిచే ప్రాథమిక హక్కు మోటారు వాహనాల ప్రయాణ హక్కుపై ఆధిక్యం కలిగి ఉంటుంది” అని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసు ఓ విషాద ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. తన తండ్రితో కలిసి పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్న ఐదేళ్ల బాలుడు ట్రక్ ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటనపై విచారణ సందర్భంగా పాదచారుల భద్రత అంశాన్ని కోర్టు సీరియస్గా తీసుకుని విచారించింది.
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
తీర్పులో జస్టిస్ నరసింహ మాట్లాడుతూ.. “భయాందోళనలు లేకుండా విశాలమైన ఫుట్పాత్పై నడవడం ప్రతి మనిషికి అత్యంత ప్రాథమిక హక్కు. నడక అనేది జీవితంతో విడదీయరాని మానవ కార్యకలాపం” అని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛగా సంచరించే హక్కు (Article 19)లో భాగంగానే నడిచే హక్కు కూడా అంతర్భాగమని పేర్కొన్నారు. అయితే కాలక్రమేణా ఆర్థిక అభివృద్ధి, పట్టణీకరణ, వాణిజ్య అవసరాల కారణంగా పాదచారుల అవసరాలను ప్రభుత్వాలు విస్మరించాయని కోర్టు విమర్శించింది. రహదారులు, ఎక్స్ప్రెస్వేలు నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చినా.. ఫుట్పాత్ల ఏర్పాటుపై తగిన శ్రద్ధ చూపలేదని పేర్కొంది. దీంతో పాదచారులు రోడ్లపై ఇబ్బందులకు గురవుతూ, ప్రమాదాలకు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
“ఒకప్పుడు వాహనాలు ధనికులకే పరిమితమయ్యాయి. కానీ కాలక్రమేణా వాహనాల సంఖ్య పెరిగి రోడ్లపై ఆధిపత్యం చెలాయించాయి. ఫలితంగా నడిచే వారిని ఇబ్బందిగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఫుట్పాత్లపై కూడా వాహనాలు దూసుకెళ్లడం, పాదచారులు ప్రమాదాలకు గురవడం సాధారణమైంది. ఇకపై ఇది కొనసాగకూడదు” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భారత స్వాతంత్ర్య ఉద్యమం, సామాజిక సంస్కరణలు, రాజకీయ చైతన్యంలో నడకకు ప్రత్యేక స్థానం ఉందని కోర్టు గుర్తు చేసింది. “నడక అనేది కేవలం ప్రయాణం కాదు. అది నిరసన, ఆలోచన, సామాజిక చైతన్యం, ప్రజాస్వామ్య హక్కుల ప్రతీక. మహాత్మా గాంధీ వంటి నాయకుల ఉద్యమాల్లో నడక కీలక పాత్ర పోషించింది” అని వ్యాఖ్యానించింది. మోటారు వాహనాల చట్టం (Motor Vehicles Act, 1988) పాదచారుల హక్కులను సరైన రీతిలో గుర్తించలేదని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న చట్టాలు వాహనాలను కేంద్రంగా చేసుకుని రూపొందించబడ్డాయని.. పాదచారుల ప్రయోజనాలు ద్వితీయ స్థాయిలోనే ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాదచారుల హక్కులను రక్షించేందుకు ప్రత్యేక చట్టం అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ చట్టం ద్వారా బాధ్యత వహించాల్సిన సంస్థలను గుర్తించడం, హక్కుల ఉల్లంఘనలకు తక్షణ పరిష్కారాలు అందించడం, అమలును పర్యవేక్షించే ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.
అంతేకాకుండా ఈ తీర్పు ప్రతిని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, రహదారుల రవాణా శాఖలకు పంపాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. అలాగే పాదచారుల హక్కుల పరిరక్షణకు అవసరమైన చట్టపరమైన వ్యవస్థపై అధ్యయనం చేయాలని భారత న్యాయ సంఘం (Law Commission of India)కు సూచించింది.
ఈ కేసులో మృత బాలుడి కుటుంబానికి రూ.11 లక్షలకు పైగా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. “ఉదయం తన కుమారుడిని ప్రేమగా పాఠశాలకు తీసుకెళ్లిన తండ్రికి అది తన కుమారుడితో చివరి నడక అవుతుందని ఊహించలేదు” అంటూ జస్టిస్ నరసింహ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!